Wednesday, April 24, 2024

లేదు..లేదు….నేను పోటీలోనే ఉన్నా : జానా

నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానాకి త్వరలో జరిగే ఉప ఎన్నికల్లో పోటీ చేస్తానని కాంగ్రెస్ నాయకుడు, మాజీ మంత్రి కె.జానారెడ్డి స్పష్టం చేశారు. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు త్వరలో అక్కడ పర్యటిస్తానని ఆయన మిర్యాలగూడలో శుక్రవారం ఒక ప్రైవేట్ కార్యక్రమానికి హాజరవుతూ చెప్పారు. ఆ నియోజక వర్గానికి టీఆర్ఎస్ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న నోముల నర్శింహయ్య మృతితో ఉప ఎన్నిక అవసరం ఏర్పడింది.

ఉపఎన్నికలో పోటీకి తాను దూరం అని, తమ నాయకుడు రాహుల్ గాంధీ చెప్పినా పోటీ చేసేది లేదని జానారెడ్డి రెండు రోజుల ముందు ప్రకటించారు. పైగా రెండేళ్లలో సార్వత్రిక ఎన్నికలు ఉండడం వల్ల కూడా ఆయన పోటీకి సుముఖత వ్యక్తం చేయలేదని, తన బదులు తన కుమారుడు రఘువీర్ రెడ్డి పోటీ చేస్తారని ప్రకటించారు. తాను పార్టీ మారుతున్నట్లు సాగుతున్న ప్రచారంలోనూ వాస్తవం లేదని, అంతా మీడియా సృష్టే అనీ అన్నారు.

ఇదీ చదవండి :త్రిముఖ పోరుకు సిద్ధమవుతున్న నాగార్జునసాగర్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles