Saturday, April 20, 2024

న్యాయవాది దంపతుల హత్య కేసుపై సీబీఐ దర్యాప్తు అనవసరం: హైకోర్టు

  • హత్య కేసును హైకోర్టు నేరుగా పర్యవేక్షిస్తోందన్న సీజే ధర్మాసనం
  • వామన్ రావు తండ్రికి ఎంత బాధ ఉందో ఈ కోర్టుకు అంతే ఉందన్న ధర్మాసనం
  • ఇప్పటివరకు సరైన దిశలోనే సాగుతొందన్న హైకోర్టు
  • ఇప్పుడు సీబీఐకి కి అప్పగిస్టే సమయం వృధానేనని అభిప్రాయ పడిన హైకోర్టు

హైదరాబాద్ : హైకోర్టు న్యాయవాదులు వామన్ రావు, నాగమణి హత్యల దర్యాప్తుపై నివేదికను సోమవారంనాడు హైకోర్టులో అటార్నీ జనరల్  సమర్పించారు. ఈ కేసు దర్యాప్తు నేరుగా హైకోర్టు పర్యవేక్షణలోజరుగుతున్న కారణంగా దీనిని సీబీఐకి అప్పగించవలసిన అవసరం లేదని హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. నిందితులు ఉపయోగించిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు వెల్లడించారు.

ఇప్పటి వరకు 25 మంది సాక్షులను విచారించినట్టూ, కుంట శ్రీను, చిరంజీవి, కుమార్ వాంగ్మూలాలు మెజిస్ట్రేట్ ఎదుట నమోదు చేసినట్టూ పోలీసులు తెలిపారు. బిట్టు శ్రీను, లచ్చయ్య వాంగ్మూలాల నమోదు కోసం కోర్టులో దరఖాస్తు చేశామని చెప్పారు. కుంట శీను, చిరంజీవిలను సాక్షులు గుర్తించే ప్రక్రియ పూర్తి చేశామనీ, సిసి టీవీ, మొబైల్ దృశ్యాలను ఎఫ్ఎస్ఎల్ కి పంపించామనీ, నిందితులు వాడిన మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నామనీ పోలీసులు తెలిపారు.

Also Read: న్యాయవాదుల హత్య కేసులో సహకరించిన “కాపు అనిల్” అరెస్ట్

ప్రత్యక్ష సాక్షులకు పోలీసు భద్రత కల్పించామనీ, కొందరు సాక్షులు పోలీసు భద్రతను నిరాకరించామనీ, మూడు ఆర్టీసీ బస్సుల్లోని ప్రయాణికులను గుర్తిస్తున్నామనీ, బస్సు డ్రైవర్లు, కండక్టర్లు, ముగ్గురు ప్రయాణికుల వాంగ్మూలాలు మెజిస్ట్రేట్ ఎదుట నమోదు చేశామనీ, ఏడో నిందితుడిని కూడా చేర్చి అరెస్టు చేసామనీ పోలీసులు కోర్టుకు తెలియజేశారు.

తదుపరి విచారణ ఏప్రిల్ 7వ తేదీకి ధర్మాసనం వాయిదా వేసింది.

Paladugu Ramu
Paladugu Ramu
సీనియర్ సబ్ ఎడిటర్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles