Thursday, April 18, 2024

గవర్నర్ తో నిమ్మగడ్డ భేటీ

• ఏపీలో వేగంగా మారుతున్న పరిణామాలు
• పంచాయతీ రాజ్ శాఖ అధికారులతో భేటీ కానున్న నిమ్మగడ్డ

ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఏర్పడ్డ ప్రతిష్ఠంభన నేపథ్యంలో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్‌ ను రేపు విడుదల చేసేందుకు ఎన్నికల సంఘం సమాయత్తమవుతోంది. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అంశాలను చర్చించేందుకు గవర్నర్ బిశ్వభూషణ్‌ హరిచందన్ తో ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ సమావేశమయ్యారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు పూర్తి అనుకూల వాతావరణం ఉందని గవర్నర్ కు నిమ్మగడ్డ వివరించారు. ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం కలిగిస్తున్న ఆటంకాలపై గవర్నర్ కు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.. గవర్నర్ తో ఎస్ఈసీ భేటీ కావడం ఏపీ రాజకీయాల్లో ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. గవర్నర్ తో భేటి అనంతరం నిమ్మగడ్డ తన కార్యాలయానికి చేరుకున్నారు. పంచాయతీ రాజ్ శాఖ అధికారులతో ఎస్ఈసీ భేటీ కానున్నారు.

ఇది చదవండి: స్థానిక ఎన్నికలపై హైకోర్టు సంచలన తీర్పు

Paladugu Ramu
Paladugu Ramu
సీనియర్ సబ్ ఎడిటర్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles