Friday, April 19, 2024

సామీ! నీకు జరిగిన అన్యాయమేమి?: శ్రీనివాస్ గౌడ్

తెలంగాణ ముఖ్యమంత్రి  చంద్రశేఖరరావు అన్ని వర్గాల వారిని సమానంగా చూశారని, శాసనమండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్ కు జరిగిన అన్యాయం ఏమిటో ఆయనే స్పష్టంగా చెప్పాలని  రాష్ట్ర మంత్రి   శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కేసీఆర్ హయాంలో అందరికీ న్యాయం జరుగుతోందని, అన్ని కులాలవారినీ, అన్ని వర్గాలనూ  ముఖ్యమంత్రి సమానంగా ఆదరించారని అన్నారు. స్వామిగౌడ్ బీజేపీలో చేరిన తర్వాత చేసిన వ్యాఖ్యలకు  మంత్రి స్పందించారు. టీఆర్ఎస్ ను ఎవరూ ఏమీ చేయలేరని,  మరో 15 నుంచి 20 సంవత్సరాల వరకు తమ పార్టీ  అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ ఘన విజయం సాధించడం తథ్యం అన్నారు. 

ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యమకారులను  పట్టించుకోవడం లేదని, తెలంగాణ  ఉద్యమంతో సంబంధం లేనివారిని చేరదీసి పదవులు కట్టబెట్టారని,గుర్తింపులేనిచోట ఉండి ఆత్మాభిమానం చంపుకోలేకే పార్టీని వీడానని స్వామి గౌడ్ అన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles