Saturday, April 20, 2024

“వలస పక్షులు”

అనంత వినీల విశ్వంలో

విరాజమాన విహంగాలు

కలకూజితాలతో

పసి హృదయాలు కిలకిలలాడ                  

ఇరుపక్షాలతో వినువీధుల యాత్ర

ఏక లక్ష్యంతో అలుపెరగని ప్రయాణం

సముద్రాలు, కొండలు, దేశాలు దాటి

వస్తాయి దారి తప్పకుండా

ఏ దిక్సూచి లేకుండా

మనల్ని ఆహ్లాద పరచి

మన నేలను సస్య శ్యామలం చేసి

మరలి పోతాయి వీడ్కోలు చెబుతూ

మాతృభూమిని మరచిపోని మహితాత్మలు.

మనంకూడా వలస పక్షుల మవుతున్నాం

మాతృభూమిని వదలి పోతున్నాం

మాతృభాషను మరిచిపోతున్నాం

పరాయి పంచను చేరి స్వజనాన్ని వదిలేస్తున్నాం

స్వంత ఇంటికంటే పరాయి చూరుకు వేలాడడం

పదిలమని భావిస్తున్నాం

అజరామర ఆచారాల్ని ఈసడిస్తున్నాం

ప్రతి పరాయి విషయాన్ని పరమ పదంగా భావిస్తున్నాం

కోట్ల కోసం నోట్ల కోసం పరిగెడుతున్నాం

అపార సాంస్కృతిక వారసత్వ సంపదను

పోగొట్టుకుంటున్నామని గుర్తించలేకున్నాం

వలస పక్షుల మార్గ దర్శనమే

ఈ జాతికి నిష్కృతి మార్గం.

రాజేంద్ర సింగ్ బైస్ ఠాకూర్
రాజేంద్ర సింగ్ బైస్ ఠాకూర్
రాజేంద్ర సింగ్ బైస్ ఠాకూర్. చదివింది ఆంగ్ల సాహిత్యం అయినా తెలుగులో కవిత్వం రాస్తారు. ఇతనికి స్వామి చిన్మయానంద, సాయినాధుని శరత్ బాబుజీల కొన్ని రచనల్ని తెలుగులోకి అనువదించే అవకాశం లభించింది. కొన్ని సాహిత్య విమర్శనాత్మక వ్యాసాలు రాశారు త్రివేణి, మిసిమి లాంటివాటిలో. చెప్పదలచుకున్నది కొద్ది మాటల్లోనే వ్యక్త పరచడం ఇతని కవిత్వ లక్షణం. భావుకత, లోతైన ఆలోచన, ఆధునికత, వేదంత విషయాలపై మక్కువ,భాషపై పట్టు ఇతని కవితలలో కనిపిస్తాయి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles