Friday, March 29, 2024

మోహం

మనువు ధర్మం చెప్పాడు.

రుషులు భూతదయ అన్నారు.

శంకరాచార్యుడు దేవుడు ఒక్కడే అన్నాడు

క్రీస్తు ప్రేమ అన్నాడు

బుద్ధుడు అహింస అన్నాడు

పురాణ పురుషులు

గాంధి మాత్రమే పాటించారు.

వారి వారసులం మనం

నిజంగా వారసులమేనా

మరెందుకు కులం కొట్లాటలు

మతం కుమ్ములాటలు

ప్రాంతాల యుద్ధాలు

పార్టీల పేరున కుతంత్రాలు

అధికారం కోసం కుట్రలు.

అంతమయ్యే జీవితాల్లో

అనంత ఆశలు

ఆరోగ్యం, కుటుంబం, సంతోషం మరచి

సంపాదనే లక్ష్యంగా

ఏం చేస్తున్నామో ఎందుకు చేస్తున్నామో

ఆలోచన లేకుండా

ఎందరినో దోచి దాచుకోవడం

పోయేటప్పుడు వెంట రాదని తెలిసినా

వదలని మోహం

దానితో ఈర్ష్య, ద్వేషం, వైషమ్యం.

పిల్లల కోసం అంటారు

వాళ్లు సంపాదించుకోలేరనే మూర్ఖత్వం

ఎప్పుడు బయట పడతాం ఈ యావ నుండి?

Also read: “తపన”

Also read: “యుగాది”

Also read: “మునక”

Also read: ‘ఆ గురువు లెక్కడ’

Also read: “స్కూలీ”

Previous article
Next article
రాజేంద్ర సింగ్ బైస్ ఠాకూర్
రాజేంద్ర సింగ్ బైస్ ఠాకూర్
రాజేంద్ర సింగ్ బైస్ ఠాకూర్. చదివింది ఆంగ్ల సాహిత్యం అయినా తెలుగులో కవిత్వం రాస్తారు. ఇతనికి స్వామి చిన్మయానంద, సాయినాధుని శరత్ బాబుజీల కొన్ని రచనల్ని తెలుగులోకి అనువదించే అవకాశం లభించింది. కొన్ని సాహిత్య విమర్శనాత్మక వ్యాసాలు రాశారు త్రివేణి, మిసిమి లాంటివాటిలో. చెప్పదలచుకున్నది కొద్ది మాటల్లోనే వ్యక్త పరచడం ఇతని కవిత్వ లక్షణం. భావుకత, లోతైన ఆలోచన, ఆధునికత, వేదంత విషయాలపై మక్కువ,భాషపై పట్టు ఇతని కవితలలో కనిపిస్తాయి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles