Thursday, March 28, 2024

బండి సంజయ్ పై కేటీఆర్ తరఫు న్యాయవాది నోటీసు

పరువు నష్టం దావా ఎందుకు వేయకూడదో చెప్పమంటూ ఐటీ మంత్రి కల్వకుంట్ల తరాకరామారావు (కేటీఆర్)  తన న్యాయవాది చేత బీజేపీ తెలంగాణశాఖ అధ్యక్షుడు బండి సంజయ్ కి  నోటీసులు జారీచేయించారు.

ఈనెల 11వ తేదీన ట్విట్టర్ లో మంత్రి కేటీఆర్ పైన నిరాధారమైన ఆరోపణలు బండి సంజయ్ చేశారని కేటీఆర్ ఆరోపించారు. బండి సంజయ్ చేసిన ఆరోపణలను నిరూపించే ఆధారాలు ఉంటే బయట పెట్టాలని, లేదంటే బహిరంగ క్షమాపణ కోరాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పరువు నష్టం దావా వేస్తానని కేటీఆర్ బండి సంజయ్ ను హెచ్చరించారు.

ఈ మేరకు శుక్రవారంనాడు బండి సంజయ్ కి కేటీఆర్ తరఫు న్యాయవాది నోటీసు జారీ చేశారు.  మంత్రి కేటీఆర్ ప్రాబల్యం దృష్టిలో ఉంచుకొని, ఆయనపై నిరాధారమైన ఆరోపణలు చేసి, ప్రచారం పొందాలన్న దురుద్దేశంతోనే బండి సంజయ్ అబద్ధాలు చెప్పారని నోటీసులో న్యాయవాది వ్యాఖ్యానించారు. ఒక జాతీయ స్థాయి పార్టీ కి ప్రాతినిధ్యం వహిస్తున్న బండి సంజయ్ ప్రజా జీవితంలోని కనీస ప్రమాణాలు పాటించకుండా… కేవలం ప్రచారం పొందాలన్న యావతో ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యల అంశాన్ని తన క్లైంట్ కేటీఆర్ కి ఆపాదించే దురుద్దేశ పూర్వకమైన ప్రయత్నం చేశారని న్యాయవాది ఆరోపించారు. కేటీఆర్ పరువుకు నష్టం కలిగించేలా, అసత్య పూరిత వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్ సివిల్, క్రిమినల్ చట్టాల ప్రకారం కేటీఆర్ కి పరిహారం చెల్లించడంతో పాటు చట్టప్రకారం తగిన చర్యలకు అర్హులవుతారని తన నోటీసులో న్యాయవాది స్పష్టం చేశారు. 48 గంటల్లో తన క్లయింట్ కేటీఆర్ కి బేషరతుగా క్షమాపణ చెప్పాలని న్యాయవాది సంజయ్ ను డిమాండ్ చేశారు.

సాదిక్
సాదిక్
సాదిక్ పన్నెండేళ్ళకు పైగా ఎలక్ట్రానిక్స్ జర్నలిజంలో ఉన్నారు. కమ్యూనికేషన్స్, జర్నలిజంలలోో ఎంఏ, ఎల్ఎల్ బీ చదివిన విద్యాధికుడు. హెచ్ఎంటీవీలో సీనియర్ కరెస్పాండెంట్ గా పని చేశారు. విశ్వసనీయత, కచ్చితత్వం, సామాజిక శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని వృత్తి విలువలకు నిబద్ధుడై పని చేసే నిష్ఠ కలిగిన జర్నలిస్టు. Phone: 8179221604

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles