Friday, April 19, 2024

హార్వర్డ్ ఇండియా కాన్ఫరెన్స్ లో ప్రసంగించనున్న మంత్రి కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర మంత్రి కే తారకరామారావు మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ వేదిక పైన ప్రసంగించబోతున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న హార్వర్డ్ ఇండియా కాన్ఫరెన్స్ లో మంత్రి కేటీఆర్ ప్రసంగించబోతున్నారు. ఈ మేరకు మంత్రి కే.తారకరామారావు కి హార్వర్డ్ ఇండియా కాన్ఫరెన్స్ నిర్వాహకులు ఇప్పటికే ఆహ్వానం పంపించారు. ఈనెల 20వ తేదీన ఇండియా @2030 – ట్రాన్స్ఫర్మేషనల్ డికేడ్ అనే అంశం పైన మంత్రి కేటీఆర్ తన ఆలోచనలను పంచుకోబోతున్నారు. 20వ తేదీన సాయంత్రం ఆరున్నర గంటలకు మంత్రి ఈ సదస్సు లో వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమంలో ప్రసంగించబోతున్నారు.

ఈ దశాబ్దంలో భారతదేశ పురోగతి శీఘ్రగతిన జరగాలంటే ప్రభుత్వాలు వివిధ రంగాల్లో ముఖ్యంగా వ్యాపారం, వాణిజ్యం, ప్రభుత్వ విధానాలు, ఈజ్ ఆఫ్ డూయింగ్, బిజినెస్, మహిళలకు ప్రాధాన్యత కల్పించే బిజినెస్ ఇంక్యుబేటర్లు, ఐటి, ఐటి అనుబంధ రంగాల్లో తీసుకోవాల్సిన చర్యల పైన మంత్రి తన ఆలోచనలను పంచుకుంటారు. తన ప్రసంగంలో కేటీఆర్ ఆయా రంగాల్లో తెలంగాణ ప్రభుత్వం తన విప్లవాత్మక, వినూత్న విధానాలతో సాధించిన సానుకూల మార్పులను, ప్రగతిని ప్రస్తావించనున్నారు. తనకు ఆహ్వానం పంపిన హార్వర్డ్ ఇండియా కాన్ఫరెన్స్ నిర్వాహకులకు మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. కాన్ఫరెన్స్ లో భాగస్వామి అయ్యేందుకు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు.

సాదిక్
సాదిక్
సాదిక్ పన్నెండేళ్ళకు పైగా ఎలక్ట్రానిక్స్ జర్నలిజంలో ఉన్నారు. కమ్యూనికేషన్స్, జర్నలిజంలలోో ఎంఏ, ఎల్ఎల్ బీ చదివిన విద్యాధికుడు. హెచ్ఎంటీవీలో సీనియర్ కరెస్పాండెంట్ గా పని చేశారు. విశ్వసనీయత, కచ్చితత్వం, సామాజిక శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని వృత్తి విలువలకు నిబద్ధుడై పని చేసే నిష్ఠ కలిగిన జర్నలిస్టు. Phone: 8179221604

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles