Friday, March 29, 2024

ఇద్దరు మెరికల్లాంటి పేదింటి బిడ్డలకు కేటీఆర్ చేయూత

  • అనీల్ కుమార్, ప్రశాంతరెడ్డి జీవితాల్లో కొత్త వెలుగు
  • ఒకరు ఐఐటీ, మరొకరు ఎంబీబీఎస్ విద్యార్థులు

ఇద్దరు మెరికల్లాంటి పేదింటి బిడ్డలకు బుధవారంనాడు మంత్రి కేటీఆర్ అండగా నిలిచారు. అందులో ఒకరు ఐఐటీ ఖరగ్‌పూర్‌లో ఇంజనీరింగ్ సీటు సాధించగా, మరొకరు నీట్ పరీక్షలో మంచి ర్యాంకు సాధించి సూర్యాపేట ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎంబిబీఎస్ సీటు సంపాదించాడు.

సూర్యాపేట్ జిల్లా ఆత్మకూర్ (ఎస్) మండలంలోని తుమ్మల పెన్‌పహాడ్ గ్రామానికి చెందిన పారిశుధ్య కార్మికుడు పిడమర్తి ప్రసాద్ కుమారుడు అనిల్ కుమార్‌కు ఐఐటీ ఖరగ్‌పూర్‌లో అప్లైడ్ జియాలజీలో ఇంజనీరింగ్ సీట్ వచ్చింది. అయితే ఆర్ధిక ఇబ్బందుల వల్ల చదువు కొనసాగించడం కష్టమవుతున్నది. విషయం సోషల్ మీడియా ద్వారా మంత్రి కేటీఆర్ దృష్టికి రాగా ఇవ్వాళ ఆ కుటుంబాన్ని కలిసి అనిల్ కుమార్ విద్యకు కావలసిన ఆర్థిక సాయం అందించారు. చదువు పూర్తయ్యాక అమ్మా నాన్నలను మంచిగా చూసుకోవాలని, ఇతరులకు సాయపడాలని మంత్రి అనిల్ తో అన్నారు.

మహబూబ్‌నగర్‌కు చెందిన ఆటో డ్రైవర్  గోపాల్ రెడ్డి కుమారుడు ప్రశాంత్ రెడ్డి ఇటీవల జరిగిన నీట్ పరీక్షలో మంచి ర్యాంకు సాధించి సూర్యాపేటలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎంబిబీఎస్ సీటు పొందాడు. కానీ ఖర్చులకు డబ్బులు లేక సాయం ఆర్ధిస్తూ మంత్రి కేటీఆర్ గారికి గత నెలలో ట్వీట్ చేసాడు. స్పందించిన మంత్రి కేటీఆర్ నేడు ప్రశాంత్ రెడ్డిని తన కార్యాలయంలో కలిసి తన చదువు ఖర్చులకు అవసరమైన ఆర్థిక సాయం అందించాడు. డాక్టర్ చదువు పూర్తయిన తర్వాత పేదప్రజలకు సేవలు అందించాలని మంత్రి ప్రశాంత్‌కు సూచన చేశారు.

సాదిక్
సాదిక్
సాదిక్ పన్నెండేళ్ళకు పైగా ఎలక్ట్రానిక్స్ జర్నలిజంలో ఉన్నారు. కమ్యూనికేషన్స్, జర్నలిజంలలోో ఎంఏ, ఎల్ఎల్ బీ చదివిన విద్యాధికుడు. హెచ్ఎంటీవీలో సీనియర్ కరెస్పాండెంట్ గా పని చేశారు. విశ్వసనీయత, కచ్చితత్వం, సామాజిక శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని వృత్తి విలువలకు నిబద్ధుడై పని చేసే నిష్ఠ కలిగిన జర్నలిస్టు. Phone: 8179221604

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles