Wednesday, April 24, 2024

కుండపోత వానల పరిస్థితిని సమీక్షిస్తున్న కేసీఆర్

రాష్ట్రంలో వానలు, వరదల పరిస్థితిపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సొమవారం ప్రగతి భవన్ లో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. మంత్రులు,ప్రజా ప్రతి నిధులతో ఫోన్లో మాట్లాడుతూ రక్షణ చర్యల పై సీఎం కేసిఆర్ అదేశాలిచ్చారు.

 అన్ని జిల్లాల అధికారులతో మాట్లాడుతూ పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ అంచనా వేస్తున్నారు. గోదావరి లో వరద పరిస్థితిని, నదీ ప్రవాహాన్ని, గోదావరి ఉప నదుల్లో వరద పరిస్థితిని సీఎం ఆరా తీస్తున్నారు. సమాచారాన్ని స్క్రీన్ మీద పరిశీలించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ముందస్తు అంచనా వేస్తున్నారు.

 అవసరమైన చోట తీసుకోవాల్సిన తక్షణ చర్యలపై సంబంధిత  అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఎటువంటి పరిస్థితిలు ఎదురైనా ఎదుర్కోవడానికి ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉందని సిఎం కేసిఆర్ మరోమారు స్పష్టం చేశారు.

ఈ సమీక్షా సమావేశంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి,  రాజ్యసభ సభ్యులు దామోదర్ రావు, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ప్రభుత్వ ముఖ్య సలహాదారుడు రాజీవ్ శర్మ, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, పైళ్ల శేఖర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డిజిపి మహేందర్ రెడ్డి,  సిఎంఓ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్.నర్సింగ రావు, సీఎంఓ కార్యదర్శులు రాజశేఖర్ రెడ్డి, స్మితా సబర్వాల్, భూపాల్ రెడ్డి, సీఎం వోఎస్డి ప్రియాంక వర్ఘీస్, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు,  ఇరిగేషన్ శాఖ ఇఎన్పీ మురళీధర్, రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్, లా అండ్ ఆర్డర్ అడిషనల్ డిజి  జితేందర్ తదితరులు పాల్గొన్నారు.

రికార్డు స్థాయిలో గోదావరికి వరద

100 ఏళ్ల చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా రికార్డు స్థాయిలో గోదావరికి వరద వచ్చింది. పోలవరం ప్రాజెక్ట్ దగ్గర గోదావరి ఉగ్రరూపం ధరించింది. అధికారులు ప్రాజెక్ట్ 48 గేట్లు ఎత్తి ఉంచారు. పోలవరం ప్రాజెక్ట్ నుండి 9లక్షల క్యూసెక్కుల వరద దిగువకు విడుదల చేశారు. సోమవారం మధ్యాహ్నానికి 12లక్షల క్యూసెక్కుల వరద వస్తుందని అంచనా. వరద ఉధృతితో ప్రాజెక్ట్ పనులు నిలిచిపోయాయి. ప్రస్తుతం పోలవరం ప్రాజెక్ట్ దగ్గర 32.2మీటర్ల చేరుకున్న గోదావరి నీటిమట్టం. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు ఆకస్మికంగా గోదావరికి  భారీ వరద. గంటకు 35 సెంమీ చొప్పున పెరుగుతున్న గోదావరి నీటి మట్టం.

సాదిక్
సాదిక్
సాదిక్ పన్నెండేళ్ళకు పైగా ఎలక్ట్రానిక్స్ జర్నలిజంలో ఉన్నారు. కమ్యూనికేషన్స్, జర్నలిజంలలోో ఎంఏ, ఎల్ఎల్ బీ చదివిన విద్యాధికుడు. హెచ్ఎంటీవీలో సీనియర్ కరెస్పాండెంట్ గా పని చేశారు. విశ్వసనీయత, కచ్చితత్వం, సామాజిక శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని వృత్తి విలువలకు నిబద్ధుడై పని చేసే నిష్ఠ కలిగిన జర్నలిస్టు. Phone: 8179221604

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles