Friday, March 29, 2024

పద్మశ్రీమొగిలయ్యకు ఇంటిస్థలం, కోటి రూపాయలు:కేసీఆర్ ప్రకటన

హైదరాబాద్ : పద్మశ్రీ దర్శనం మొగిలయ్య కు హైద్రాబాద్ లో  నివాస యోగ్యమైన ఇంటి స్థలంతో పాటు ఇంటి నిర్మాణం  ఖర్చు, ఇతరత్రా అవసరాల కోసం రూ.1 కోటి ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. శుక్రవారంనాడు ప్రగతి భవన్ లో కేసీఆర్ ను మొగిలయ్య కలుసుకున్నారు. మొగిలయ్యకు శాలువా కప్పి సత్కరించారు. దర్శనం మొగిలయ్య నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండలం అవుసలికుంటకు చెందినవారు. పన్నెండు మెట్ల కిన్నెర పలికించేవారిలో ఆయన నేటి తరం కళాకారుడు. గ్రామీణ నేపథ్యంలో దశాబ్దాలుగా ఈ కళను నమ్ముకొని జీవించడమే కాకుండా దానిని పునరుజ్జీవింపజేయడానికి శక్తివంచన లేకుండా శ్రమిస్తున్నారు. ‘‘కిన్నెర మెట్ల కళ అత్యంత అద్భుతమైనది. నాతోనే ఈ కళ అంతం అవుతుందా అని మనోవ్యధ చెందుతున్న సమయంలో పద్మశ్రీ పురస్కారం దక్కిందనీ, ఈ కళకు జీవం పోసినట్టు అయిందనీ మొగిలయ్య పద్మ అవార్డు గురించి విన్న తర్వాత వ్యాఖ్యానించారు.

సాదిక్
సాదిక్
సాదిక్ పన్నెండేళ్ళకు పైగా ఎలక్ట్రానిక్స్ జర్నలిజంలో ఉన్నారు. కమ్యూనికేషన్స్, జర్నలిజంలలోో ఎంఏ, ఎల్ఎల్ బీ చదివిన విద్యాధికుడు. హెచ్ఎంటీవీలో సీనియర్ కరెస్పాండెంట్ గా పని చేశారు. విశ్వసనీయత, కచ్చితత్వం, సామాజిక శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని వృత్తి విలువలకు నిబద్ధుడై పని చేసే నిష్ఠ కలిగిన జర్నలిస్టు. Phone: 8179221604

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles