Wednesday, April 24, 2024

పెదవడ్లపూడిలో రైతుల అవగాహన సదస్సు

పెదవడ్లపూడిలో రైతుల అవగాహన సదస్సు

పెదవడ్లపూడి : శ్రీ సత్య షిరిడి సాయిబాబా ఆలయ సందర్శన,  రైతులతో ముఖాముఖీ కార్యక్రమం సందర్బంగా పెదవడ్లపూడి గ్రామాన్నిశుక్రవారంనాడు సందర్శించిన ఐపీఎస్ అధికారి సిబిఐ మాజి జాయంట్ డైరెక్టర్  లక్ష్మినారాయణకు బీజేపీ రాష్ట్రకార్యదర్శి, మాజి జడ్పీ చైర్మన్ పాతూరి నాగభూషణం పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దర్శనం  అనంతరం రైతుల యాజమాన్య పద్ధతులపై అవగాహనను పెంచే కార్యక్రమాన్ని నిర్వహించారు. . ఈ కార్యక్రమంలో జేడీ ఫౌండేషన్ పాపన్న, పెదబాబు, ఆర్గానిక్ రైతు సంఘాలు, గ్రామ రైతులు పాల్గొన్నారు. సేంద్రియ వ్యవసాయ పద్ధతులనూ, మందలు వాడకుండా పంటలు పండిచడంలోని మెలకువలనూ ఈ కార్యక్రమంలో చర్చించారు. రైతులు పంటదిగుబడి గురించీ, ఆర్గానిక్ పంటలు పండించడంలోని సాధకబాధకాలు గురించి తమకున్న సందేహాలను నివృత్తి చేసుకున్నారు. జెడి అక్ష్మీనారాయణ ఆర్గానిక్ వ్యవసాయంలోని ఉపయోగాలనూ, ఆరోగ్య సంరక్షణకు గల అవకాశాలనూ వివరించారు.

Related Articles

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles