Friday, April 19, 2024

ఒకప్పుడు …

ఒకప్పుడు

అక్కడ ఓ ఇల్లు ఉండేది

మూడు బావులుండేవి

జీవం వుండేది

జీవనది లాంటి మనుషులు వుండేవాళ్ళు

అందరికీ భోజనమే కాదు

మందులను ఇచ్చిన చేతులు ఉండేవి.

తొమ్మిది మందికే కాదు

మరెంతో మందికి జన్మనిచ్చింది ఆ ఇల్లు

తొమ్మిది మంది శాఖోపశాఖలై

విశ్వవ్యాప్తం అయినారు

ఇల్లూ

తల్లీ

తండ్రీ

వయసుడిగి

జీవనం చాలించారు 

తొమ్మిది మందిలో

అయిదుగురు అర్ధాంతరంగా

తమ జీవనాన్ని ముగించారు

కరోనా కర్కశ కాటుకి

మరొకరు బలైపొయారు

ఇప్పుడు

తొమ్మిది లో మిగిలింది

ముగ్గురే

ఒక్కో చోట ఒకరు

ఒకప్పుడు అక్కడో ఇల్లుండేది

ఇప్పుడు

దాని ఆనవాళ్లు మాత్రమే

కాలం కాఠిన్యానికి

ఇల్లేమిటీ

మనుషులేమిటీ

అన్నీ

కరిగిపోయాయి 

ఇల్లుదేముందీ

ఇవ్వాళ కాకపోతే

రేపు

మరో రూపంలో

దర్శనం ఇస్తుంది

అర్ధాంతరంగా పొయిన

మనుషులు

జ్ఞాపకాలు గా

మరో రూపంలో

కనిపిస్తారా ..?

ఏవైనా అట్లాగే ఉండాలనుకోవడం

ఎంత సహజమో

అలా లేవని

బాధ పడటం అంతే సహజమేమో !!

Also read: నో …ఓపెన్ సెసేం

Also read: బ్రహ్మకమలం

Also read: నాలుగు పాదాల మీద న్యాయం …

Also read: ప్రార్ధన

Also read: పరిమళం     

Rajender Mangari
Rajender Mangari
మంగారి రాజేందర్ జింబో కి కవిత్వం,కథలు ఉచ్ఛ్వాస నిశ్వాసలు . అందరికీ న్యాయం అందాలన్నది అయన అభిమతం . జిల్లా సెషన్స్ జడ్జిగా, జ్యుడీషియల్ అకాడెమీ డైరెక్టర్ గా, తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ సభ్యునిగా పనిచేసి,పదవీ విరమణ చేసినప్పటికీ రచయితగా తన సామాజిక బాధ్యత నిరంతరం అని విశ్వసించే వ్యక్తి. (మా వేములవాడ కథలు, జింబో కథలతో కథా సాహిత్యం మీద ఆయన చెరగని ముద్ర వేసారు. హాజిర్ హై అంటూ నేర న్యాయ వ్యవస్థ పై మరే కవీ రాయలేని కవిత్వం రాశారు. లోపలివర్షం,రెండక్షరాలు కవిత్వం సెంటిమెంట్, మానవ సంబంధాలు ప్రతిబింబిస్తే ,"చూస్తుండగానే "లో ఆధునిక జీవితం లోని సంక్లిష్టతని కవిత్వీకరించారు.)

Related Articles

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles