Thursday, April 25, 2024

వైజాగ్ స్టీల్ ను కాపాడుకోండి

  • ఎపి సీఎం ను కలిసిన ఇంటక్ నేతలు

వైజాగ్ స్టీల్ ను ప్రభుత్వ రంగంలోనే కాపాడుకోవాలని.. అందుకు కృషి చేయాలని ఐఎన్టీయుసి నేతలు ఆదివారం అమరావతి లో ఆంద్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ ను కలసి విజ్ఞప్తి చేశారు. లేబర్ చట్టాలపై కార్మికుల హక్కుల పరిరక్షణ.. జాతీయ స్థాయిలో పరిశ్రమల ప్రైవేటీకరణ తదితరాలపై చర్చించారు. ఇంటక్ జాతీయ అధ్యక్షులు జీ. సంజీవరెడ్డి.. కార్యదర్శి.. సింగరేణి లో ఇంటక్ సెక్రటరీ జనరల్ బి.జనక్ ప్రసాద్, తదితరులు సీఎం ను కలిసిన వారిలో ఉన్నారు. జనక్ ప్రసాద్ కు వైస్సార్ కాలం నుంచి జగన్ తో మంచి అనుబంధం ఉంది. కొద్దిసేపు పాత జ్ఞాపకాలను చర్చించు కున్నామని జనక్ అన్నారు. ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి గా జగన్ అద్భుతంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. ఆయన తండ్రికి తగ్గ తనయుడు అన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles