Tuesday, April 23, 2024

గుజరాత్ లో మోదీ హవా -పీపుల్స్‌పల్స్‌

•        గుజరాత్ లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఎప్పటిలాగే మోదీ హవా నడిచింది-  పీపుల్స్‌ పల్స్‌

•        పీపుల్స్‌ పల్స్‌ సంస్థ నిర్వహించిన ఎగ్జిట్ పోల్ సర్వే ప్రకారం గుజరాత్ లో బీజేపీకి 125-143, కాంగ్రెస్ 30-48, ఆమ్ ఆద్మీ పార్టీకి 3-7,  ఇతరులకు 2-6 సీట్లు వచ్చే అవకాశం ఉంది.

•       ఇన్ని సీట్లు రావడానికి  మోదీ హవానే కారణం – పీపుల్స్‌పల్స్‌

•        పీపుల్స్‌ పల్స్‌ సంస్థ నిర్వహించిన ఎగ్జిట్ పోల్ సర్వే ప్రకారం బిజెపి-కాంగ్రెస్‌ మధ్య ఓట్ల వ్యత్యాసం  21 శాతంగా  ఉంది.

•        పీపుల్స్‌ పల్స్‌ ఎగ్జిట్ పోల్ సర్వే ప్రకారం బీజేపీకి 46 శాతం, కాంగ్రెస్‌ పార్టీకి 25 శాతం, ఆమ్‌ ఆద్మీ పార్టీకి 16 శాతం, ఇతరులకు 13  శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉంది. మార్జిన్ ఆఫ్ ఎర్రర్  ± 3 శాతం.

•        182 స్థానాలు ఉన్న గుజరాత్ శాసనసభలో అధికారపీఠం కైవసం చేసుకోవాలంటే 92 సీట్లు గెలవాలి – పీపుల్స్‌పల్స్‌

• ప్రధానమంత్రి నరేంద్రమోదీ సొంత రాష్ట్రం అయినందున, ఎప్పటిలాగే ఆయన సెంటిమెంట్ బీజేపీకి లాభం చేకూర్చింది – పీపుల్స్‌ పల్స్‌

• ఈ సారి గుజరాత్ లో దాదాపు 30 బహిరంగ సభల్లో  నరేంద్ర మోదీ పాల్గొనడం, వరసగా పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేయడంతో పాటు అమిత్ షా  క్షేత్రస్థాయిలో ఉండి వ్యుహాలు రచించడం వల్ల గుజరాత్ లో బీజేపీ తన పట్టు నిలుపుకోగలిగింది- పీపుల్స్‌పల్స్‌

• ఆమ్ ఆద్మీ పార్టీ 16 శాతం ఓట్లు సాధించినా, సీట్లు సాధించడంలో విఫలమయ్యింది- పీపుల్స్‌పల్స్‌

• గుజరాత్ ఎన్నికల్లో ఓట్లు సాధించిన ఓట్ల శాతం వల్ల ఆమ్ ఆద్మీ పార్టీకి జాతీయ పార్టీ హోదా వచ్చే అవకాశం ఉంది- పీపుల్స్‌పల్స్‌

•   2017 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే బీజేపీ ఓట్ షేర్ 3.1 శాతం తగ్గింది. కాంగ్రెస్ ఓట్ షేర్ 16.4 శాతం తగ్గింది.  – పీపుల్స్‌ పల్స్‌

• 2017 రాహుల్ గాంధీ లాగా, ఈ సారి జాతీయ నాయకులు ఎవరూ గుజరాత్ ఎన్నికలపై ఫోకస్ పెట్టకపోవడమే కాంగ్రెస్ ఓట్ల శాతం తగ్గడానికి కారణమని పీపుల్స్ పల్స్ సర్వేలో వెల్లడయింది.

• దళిత ఉద్యమ నాయకుడు జిగ్నేష్ మేవానీ కాంగ్రెస్ లో చేరడం వల్ల ఆ పార్టీకి మేలు చేకూరింది- పీపుల్స్‌ పల్స్‌

• మైనార్టీలు తప్ప దాదాపు అన్ని సామాజిక వర్గాలు బీజేపీ వైపే నిలబడ్డాయి.- పీపుల్స్‌పల్స్‌

• హర్థిక్ పటేల్, అల్పేష్ ఠాకూర్… పార్టీలో చేర్చుకోవడం వల్ల బీజేపీకి ప్లస్ అయ్యింది – పీపుల్స్‌పల్స్‌

•    నిత్యావసర వస్తువుల ధరలపెరుగుదల, నిరుద్యోగం, పంటలకు కనీస మద్దతు ధర, అభివృద్ధి, అవినీతి వంటివి గుజరాత్ లో  ప్రధానమైన సమస్యలని పీపుల్స్‌పల్స్‌ ఎగ్జిట్ పోల్ సర్వేలో వెల్లడైంది.

• రైతులు, సామాన్యులు బీజేపీపై అసంతృప్తితో ఉన్నా… వారికి వేరే ప్రత్యామ్నాయ పార్టీ కనిపించకపోవడంతో మళ్లీ బీజేపీకే పట్టం కట్టారు – పీపుల్స్‌పల్స్‌

• స్థానిక సమస్యలపై ఫోకస్ పెట్టినందుకే కాంగ్రెస్ కి ఈ మాత్రం సీట్లు వస్తున్నాయి.- పీపుల్స్‌పల్స్‌

•        ప్రస్తుత ముఖ్యమంత్రి భూపేందర్ పటేల్ కు 24 శాతం మంది, మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ 20 శాతం, హర్థిక్ పటేల్ కు 14 శాతం మంది, ఈ ఎన్నికల తరువాత ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు – పీపుల్స్‌పల్స్‌

• గుజరాత్ లో  పీపుల్స్‌పల్స్‌ సంస్థ ఎగ్జిట్ పోల్ సర్వేను 60 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 240 పోలింగ్‌ స్టేషన్లలో నిర్వహించి, మొత్తం 4800 శాంపిల్స్‌ను సేకరించింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles