Thursday, April 25, 2024

బ్రహ్మకుమారీల అధినేత దాదీ నిర్యాణం

మౌంట్ అబూ: బ్రహ్మకుమారీస్ ముఖ్యఅధినేత దాదీ హృదయమోహిని పరమపదించారు. హృదయమోహిని (దాది గుల్జార్) మార్చి 11వ తేదీ బుధవారం ఉదయం తన భౌతిక శరీరాన్ని త్యాగం చేశారు.

బ్రహ్మకుమారీలకు ముఖ్యకేంద్రమైన మౌంట్ అబూలో ఆమె పార్థివదేహాన్ని రాజస్థాన్ పాండవ భవన్ లో ప్రజల సందర్శనార్థం 12వ తేదీన ఉంచుతారు.  ఇక్కడి శాంతివన్ లో 13వ తేదీ దాది అంతిమయాత్ర సాగుతుంది.

బ్రహ్మకుమారీలందరూ ఆమెకు శ్రద్ధాంజలి ఘటించారు. దేశవిదేశాలలోని అభిమానులు ఆమెకు అంజలి ఘటించారని బ్రహ్మకుమారీల జాతీయ మీడియా సమన్వయకర్త బీకే సరళాబెన్ ఒక ప్రకటనలో తెలియజేశారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles