Saturday, April 20, 2024

మద్యం దుకాణాల్లో గౌడలకు 15, ఎస్సీలకు 10, ఎస్టీలకు 5 శాతం కేటాయింపు

  • చిన్న పిల్లలకు కరోనా వస్తే చికిత్సకోసం ముందు జాగ్రత్త చర్యలు
  • సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణానికి సత్వర చర్యలు
  • ధరణి పోర్టల్ లో సమస్యల పరిష్కారానికై ఉపసంఘం

హైదరాబాద్ : వచ్చే యేడాది నుంచి మద్యం దుకాణాల్లో గౌడ కులస్థులకు 15 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం కేటాయించాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన గురువారం ప్రగతి భవన్ లో క్యాబినేట్ సమావేశం ఆరుగంటల పాటు కొనసాగింది. పలు అంశాలపై చర్చించి కేబినెట్ చర్చించి.  నిర్ణయాలు తీసుకున్నారు.

Also read: చరిత్ర సృష్టించిన కోయ మహిళ గుమ్మడి అనూరాధ, లా కాలేజీ ప్రిన్సిపల్ గా నియామకం

పోడు భూముల సమస్యలపై క్యాబినేట్ సబ్ కమీటి ఏర్పాటు చేశారు. కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లు, ఇతర పోలీస్ స్టేషన్లలోని సమస్యలు అవసరాలను సమీక్షించేందుకు కేబినెట్ సబ్ కమిటీని నియమించారు. ధరణి పోర్టల్ లో తలెత్తుతున్న సమస్యల పరిష్కార మార్గాలకోసం కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేస్తూ క్యాబినేట్ నిర్ణయం తీసుకున్నది.

Also read: హత్యాచారం జరిగిన చిన్నారి కుటుంబసభ్యులకు పవన్ కల్యాణ్ పరామర్శ

రాష్ర్ట్ కేబినెట్ సమావేశం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన గురువారం ప్రగతి భవన్ లో జరిగింది. మధ్యాహ్నం రెండున్నరకు ప్రాంరభమైన కేబినెట్ సమావేశం దాదాపు ఆరుగంటల పాటు సాగింది. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించి కేబినెట్ నిర్ణయాలు తీసుకున్నది.

Also read: టీటీడీ పాలకమండలి సభ్యులుగా 25 మంది

వైద్య-ఆరోగ్య శాఖపై కేబినెట్ లో విస్త్రస్థాయిలో చర్చ

మొదటగా కొవిడ్ పరిస్థితిపై కేబినెట్ లో చర్చ జరిగింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా పరిస్థితులపై వైద్యాధికారులతో కేబినెట్ ఆరా తీసింది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో కరోనా స్థితిగతులు, తీసుకుంటున్న చర్యలపై వైద్యాధికారులు కేబినెట్ కు సమాచారం అందించారు. 

Also read: దుబాషీ శంకర్ అరెస్టు

ఇరుగుపొరుగు రాష్ట్రాలల్లో కరోనా పరిస్థితి, నియంత్రణకు సంబంధించిన సమాచారాన్ని ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రత్యేకంగా  అడిగి తెలుసుకున్నారు.  విద్యాసంస్థలు పునఃప్రారంభమైన అనంతర పరిస్థితులను  కేబినెట్ కు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖాధికారులు వివరించారు.  స్కూళ్లు, కాలేజీలు తెరిచిన తరువాత కరోనా కేసులలో పెరుగుదల లేదని,  కరోనా పూర్తిగా అదుపులో వుందని  వారు కేబినెట్ కు వివరించారు. అన్నిరకాల మందులు, ఆక్సిజన్, టెస్ట్ కిట్స్, వాక్సినేషన్ అందుబాటులో ఉన్నాయని వివరించారు.  ఇప్పటివరకు 2 కోట్ల వ్యాక్సినేషన్ పూర్తయిందని, అందులో 1 కోటి 45 లక్షల 19 వేల 909 మందికి మొదటి డోసు, 55 లక్షల 36వేల 250 మందికి రెండో డోసు  ఇవ్వటం జరిగిందని వైద్యశాఖ అధికారులు కేబినెట్ కు తెలిపారు.  ఒకవేళ చిన్నపిల్లలకు కరోనా వస్తే పరిస్థితులను ఎదర్కోవడానికి సిధ్దంగా వున్నామని  వైద్యాధికారులు కేబినెట్ కు వివరించారు.  ప్రత్యేకంగా చిన్నపిల్లల వైద్యం కొరకు రూ. 133 కోట్ల ఖర్చుతో 5200 బెడ్లు, మందులు తదితర సామగ్రిని, ముందస్తు ఎర్పాట్లలో భాగంగా ఇప్పటికే సమకూర్చుకున్నామని వైద్యాధికారులు తెలిపారు. స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్ నేటి నుండి ప్రారంభమవుతుందని, ప్రతి గ్రామ, మండల, జిల్లా స్థాయిల్లోని పంచాయతి మున్సిపల్ అధికారులు, సర్పంచులు, ఎంపిటీసిలు, జడ్పిటీసిలు, ఎంపిపి, జడ్పీ చైర్ పర్సన్, ఎంఎల్ఏలు, ఎంఎల్సీలు తదితర ప్రజాప్రతినిధులు క్రీయాశీలకంగా వ్యవహరించాలని, మంత్రులందరూ ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో విజయం సాధించాలని, ప్రతిరోజు 3 లక్షల వరకు టీకాలు వేసే విధంగా పూర్తి సన్నద్దతతో వ్యవహరించాలని అధికారులను, ప్రజాప్రతినిధులను కేబినెట్ నిర్దేశించింది. కొత్త మెడికల్ కాలేజీలు వచ్చే సంవత్సరం నుండి ప్రారంభించడానికి కావలసిన అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని ఆర్ అండ్ బి, వైద్యారోగ్య శాఖను కేబినెట్ ఆదేశించింది.

Also read: ఫ్యాషన్ వేదికపై మెరిసిన సుధారెడ్డి

హైదరాబాద్ లో నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణం ఏర్పాటుపై కేబినెట్ సమీక్షించింది. దవాఖానాల నిర్మాణం ఏర్పాట్లపై సత్వరమే చర్యలు చేపట్టాలని, అత్యంత వేగంగా ఆసుపత్రుల నిర్మాణం జరగాలని రోడ్లు భవనాల శాఖను కేబినెట్ ఆదేశించింది.

గతంలో 130 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి సామర్ద్యం మాత్రమే వుండేదని, దాన్ని ఇప్పటికే 280 మెట్రిక్ టన్నులకు పెంచుకున్నామని, దీనిని మరింత పెంచి 550 మెట్రిక్ టన్నులకు చేరుకునేలా చర్యలు చేపట్టాలని వైద్యశాఖాధికారులను కేబినెట్ ఆదేశించింది.

రాష్ట్రంలో పూర్తి స్థాయిలో ఆరోగ్య మౌలిక వసతుల పురోభివృధ్ది కొరకు సమగ్రమైన ప్రణాళికలను సిద్దం చేసుకుని తదుపరి కేబినెట్ ముందుకు తీసుకురావాలని మంత్రి మండలి వైద్య శాఖాధికారులను ఆదేశించారు.

వ్యవసాయం, పౌర సరఫరాల శాఖ సన్నద్ధతపై చర్చ

వర్షాపాత వివరాలు, వానాకాలంలో రాష్ట్రంలో మొత్తం సాగయిన భూమి వివరాలు, పంటల దిగుబడి అంచనాలు తదితర వ్యవసాయ అంశాల పై కేబినెట్ చర్చించింది. వానాకాలంలో పంటల కొనుగోలుపై అందుకు మార్కెటింగ్ శాఖ సన్నద్ధతపై  కేబినెట్ చర్చించింది.

పోడు భూముల సమస్యలపై పూర్తి అవగాహన, పరిష్కారాల అన్వేషణ, సూచనలకై కేబినెట్ సబ్ కమిటీ నియామకం జరిగింది. ఈ సబ్ కమిటిలో మంత్రి సత్యవతి రాథోడ్ చైర్మన్ గానూ., మంత్రులు జగదీశ్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, అజయ్ కుమార్ లు సభ్యులుగానూ వ్యవహరిస్తారు.

Also read: పోచంపల్లి చేనేత చీర పైన బెంగాల్ ఎంపీ ప్రశంసలు..

పోలీస్ స్టేషన్లలో సమస్యలపై ఉపసంఘం

కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లు ఇతర పోలీస్ స్టేషన్లలోని సమస్యలు అవసరాలను సమీక్షించేందుకు కేబినెట్ సబ్ కమిటీ నియమిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకున్నది.హోం శాఖ మంత్రి మహమూద్ అలీ నేతృత్వంలో మంత్రులు హరీష్ రావు, జగదీశ్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, వేముల ప్రశాంత్ రెడ్డి, వి.శ్రీనివాస్ గౌడ్, ఇంద్ర కరణ్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్ లు సభ్యులుగా సబ్ కమిటీ పనిచేస్తుంది. రాష్ట్రంలో నూతనంగా జిల్లాలు  ఏర్పాటు చేసిన నేపథ్యంలో అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టేందుకు సబ్ కమిటీ పోలీసు శాఖను పూర్తి స్థాయిలో సమీక్షిస్తుంది .

ధరణి పోర్టల్ లో తలెత్తుతున్న సమస్యల పరిష్కార మార్గాలకోసం….మంత్రులు హరీశ్ రావు, ప్రశాంత్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీశ్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి లతో కూడిన కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేస్తూ తీర్మానం. ముఖ్యమంత్రి కెసిఆర్ గతంలో ఇచ్చిన హామీ మేరకు, వచ్చే యేడాది నుంచి… మద్యం దుకాణాల్లో.. గౌడ కులస్థులకు 15 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం కేటాయించాలని కేబినెట్ నిర్ణయం.

రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పాడయిన రోడ్ల మరమ్మతుకు ఈ సంవత్సరం ఇప్పటికే కేటాయించిన రూ. 300 కోట్లకు అదనంగా మరో రూ.100 కోట్లు కేబినెట్ కేటాయించింది. ఈ మేరకు  పంచాయితీ రాజ్ శాఖకు కేబినెట్ ఆదేశాలు జారీచేసింది. రాజాబహద్దూర్ వెంకటరామిరెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీ వారి కోరిక మేరకు నారాయణ గూడలో  1261 గజాల స్థలాన్ని నామ మాత్రపు ధరకు బాలికల వసతి గృహ నిర్మాణం కోసం కేబినెట్ కేటాయించింది.

Also read: జీవో 111 పై నిర్ణయానికి సమయం పడుతుంది – సీఎం కేసీఆర్

సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలు

సంగారెడ్డి, ఆంధోల్, జహీరాబాద్, నారాయణ్ ఖేడ్ నియోజకవర్గాల్లో 4.56 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.  సంగమేశ్వర ఎత్తిపోతల పథకానికి సింగూరు జలాశయం కుడి వైపు నుంచి 12 టిఎంసీల నీటిని ఎత్తిపోసి జహీరాబాద్, ఆంధోల్, సంగారెడ్డి నియోజకవర్గాల్లో  2.19 లక్షల ఎకరాలకు సాగునీరందించాలని ప్రతిపాదించడం జరిగింది. ఈ పథకం ద్వారా ఈ నియోజకవర్గాల్లోని 11 మండలాల్లో 231 గ్రామాలకు సాగునీరు అందుతుంది.  ప్రాజెక్టుకు రూ.2,653 కోట్ల పరిపాలన అనుమతికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

బసవేశ్వర ఎత్తిపోతల పథకానికి సింగూరు జలాశయం ఎడమ వైపు నుంచి 8 టిఎంసీల నీటిని ఎత్తిపోసి నారాయణ్ ఖేడ్, ఆంధోల్ నియోజకవర్గాల్లో 1.65 లక్షల ఎకరాలకు సాగునీరందించాలని ప్రతిపాదించడం జరిగింది. ఈ పథకం ద్వారా ఈ నియోజకవర్గాల్లోని 8 మండలాల్లో 166 గ్రామాలకు సాగునీరు అందుతుంది.  ప్రాజెక్టుకు రూ.1,774 కోట్ల పరిపాలన అనుమతికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ రెండు ఎత్తిపోతల పథకాలకు నాబార్డు ద్వారా  రుణాలు పొందడానికి కూడా మంత్రివర్గం సాగునీటి శాఖకు ఆమోదం ఇచ్చింది.

కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజి 15,16 లో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో నిర్మాణమౌతున్న నృసింహసాగర్ (బస్వాపూర్ జలాశయం) నాబార్డు ద్వారా రూ.2051.14 కోట్ల రుణం పొందడానికి మంత్రి వర్గం ఆమోదం తెలిపింది.

Also read: అక్టోబర్ 7నుండి ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాలు

సాదిక్
సాదిక్
సాదిక్ పన్నెండేళ్ళకు పైగా ఎలక్ట్రానిక్స్ జర్నలిజంలో ఉన్నారు. కమ్యూనికేషన్స్, జర్నలిజంలలోో ఎంఏ, ఎల్ఎల్ బీ చదివిన విద్యాధికుడు. హెచ్ఎంటీవీలో సీనియర్ కరెస్పాండెంట్ గా పని చేశారు. విశ్వసనీయత, కచ్చితత్వం, సామాజిక శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని వృత్తి విలువలకు నిబద్ధుడై పని చేసే నిష్ఠ కలిగిన జర్నలిస్టు. Phone: 8179221604

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles