Saturday, April 20, 2024

గోదారంగనాథస్వామి కళ్యాణం

హైదరాబాద్ : ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు తెలుగులో, ఇంగ్లీషులో ముప్పయ్ రోజుల పాటు అందించిన తిరుప్పావై పాఠకులకు ‘సకలం.ఇన్,’ ‘ప్రైమ్ పోస్ట్ .ఇన్ ’ సంక్రాంతి శుభాకాంక్షలు. దేశవ్యాప్తంగా బుధవారంనాడు గోదా, రంగనాథస్వామి కళ్యాణం కన్నులపండువగా జరిగింది. హైదరాబాద్ లోని సంజీవరెడ్డినగర్ ప్రధాన రహదారిలోని బల్కంపేట శ్రీదేవి భూదేవి సమేత శ్రీవెంకటేశ్వర ఆలయంలో గోదారంగనాథస్వామి తిరుక్కళ్యాణం బుధవారం వైభవంగా జరిపారు. దేవస్థానం చైర్మన్ బొడ్డు కుమార్ గౌడ్, ఈవో జీఏకే కృష్ణతో పాటు స్థానిక బస్తీ, కాలనీలకు చెందిన భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అండాళ్ అమ్మవారికి సువర్ణ పట్టాభిషేకం కూడా జరిపారు.

Also Read : సంక్రాంతి శోభ

నగరంలోని బాపూనగర్ బంజారా బస్తీలోని హనుమాన్, షిర్డీ సాయిబాబా, వేంకటేశ్వర ఆలయాల్లో అర్చకులు శ్రీనివాసాచార్యులు, ఆనందాచార్యులు ఆధ్వర్యంలో గోదా రంగనాథస్వామి కళ్యాణం నిర్వహించారు. సికిందరాబాద్ మోండా శివాజీనగర్ లోని పెరుమాళ్ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో గోదాదేవి కళ్యాణం జరిగింది. ఆలయ ఈవో శ్రీనివాసశర్మ, చైర్మన్ వై నర్సారెడ్డి, పాలకమండలి సభ్యులూ, భక్తులూ ఈ ఉత్సవంలో పాల్గొన్నారు.

Also Read : గోదాగోవిందుల ప్రణవ ప్రణయ ప్రబంధం-తిరుప్పావై

Prof M Sridhar Acharyulu
Prof M Sridhar Acharyulu
ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు హైదరాబాద్ లోని మహేంద్ర విశ్వవిద్యాయలంలో డీన్, న్యాయశాస్త్ర ఆచార్యులు. అంతకు పూర్వం కేంద్ర సమాచార కమిషనర్ గా పని చేశారు. ఇంగ్లీష్ లో, తెలుగులో బహుగ్రంథ రచయిత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles