Thursday, March 28, 2024

రామోజీరావుకు భారతరత్న అయినా ఇవ్వండి లేదా … మార్గదర్శిలో తేడాలు తేల్చండి!

వోలేటి దివాకర్

మార్గదర్శి చిట్ ఫండ్ లో జరుగుతున్న అక్రమాలకు వ్యతిరేకంగా న్యాయపోరాటం చేస్తున్న మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ తాజాగా విడ్డూరమైన డిమాండ్ చేశారు . జాతీయ బ్యాంకుల కన్నా మెరుగైన పనితీరును కనపరిచేలా మార్గదర్శిని నిర్వహిస్తున్న రామోజీరావుకు దేశంలోని అన్ని జాతీయ బ్యాంకులకు  చైర్మన్ గా నియమించాలని సూచించారు . అంబానీ , అదానీ లాంటి పారిశ్రామికవేత్తలకు లక్షలాది కోట్ల రుణాలు ఇచ్చిన వాటిని రాబట్టుకోలేక దివాళా అంచుకు చేరుతున్నాయన్న విషయాన్ని ఈ సందర్భంగా ఉండవల్లి గుర్తుచేశారు . అదే మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థ ఖాతాదారులు పాట సొమ్ములను అక్కడే కేవలం 4 నుంచి 5 శాతానికే డిపాజిట్లు చేస్తున్నారని , చీటీ సొమ్మును మూడు నెలల ముందుగానే చెల్లిస్తున్నారని చెప్పారు . ఈఘనత కచ్చితంగా రామోజీరావుకే దక్కుతుందని , అందుకే ఆయనను జాతీయ బ్యాంకులకు ఛైర్మన్ గా నియమించాలని ప్రతిపాదించారు . భారత రత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేదా సంస్థలో జరుతున్న తేడాలను గుర్తించి , బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు . ఇందుకు సంబంధించి తన వద్ద ఉన్న పత్రాలను వినియోగించుకోవాలని సూచించారు . గతంలోనే ప్రభుత్వానికి ఈసూచన చేసినా సానుకూల స్పందన రాలేదన్నారు . సంస్థ ఖాతా నిల్వల్లో తేడాలు ఉన్నాయని , మనీ లాండరింగ్ కూడా జరిగి ఉండవచ్చని ఉండవల్లి అనుమానం వ్యక్తం చేశారు .

Also read: సత్యం రామలింగరాజుకో న్యాయం … రామోజీరావుకో న్యాయమా?!

తేడాలు తేల్చేస్తా …

మార్గదర్శి చిట్ ఫండ్ లో ఇటీవల జరిగిన తనిఖీల సందర్భంగా లభించిన సమాచారాన్ని బహిర్గతం చేయాలని ఉండవల్లి అరుణ్ కుమార్ డిమాండ్ చేశారు . తనిఖీల్లో లభించిన సమాచారాన్ని అందజేయాల్సిందిగా సమాచార హక్కు చట్టం కింద రిజిస్ట్రేషన్ల శాఖ ఐజికి లేఖ రాసినట్లు వెల్లడించారు . రికార్డులను పరిశీలించి , మార్గదర్శిలో జరుగుతున్న అవకతవకలను బహిర్గతం చేస్తానని , ఈ విషయంలో తనకు అనేక మంది నిపుణులు పరోక్షంగా సహకరించేందుకు సిద్ధంగా ఉన్నారని ఉండవల్లి తెలిపారు .

Also read: పాపం ఈసారి ఎవరి ‘కాపులు’?

డిపాజిట్ల సేకరణ ఆపని మార్గదర్శి

ఒకవైపు చట్టవిరుద్ధంగా సేకరించిన డిపాజిట్ల సేకరణపై న్యాయపోరాటం చేస్తున్న మార్గదర్శి సంస్థ మరోవైపు డిపాజిట్ల సేకరణను కొనసాగించడం గమనార్హం . ఈవిషయాన్ని ఉండవల్లి వెల్లడించారు . గతంలో తీసుకున్న డిపాజిట్లకు నేరుగా డిపాజిట్ పత్రాలు ఇచ్చేవారని , తాజాగా రూటు మార్చి రిసిప్ట్ పేరిట పత్రాలు ఇస్తున్నారని ఉండవల్లి తెలిపారు . ఖాతాదారుల నుంచి 3 నెలల ముందుగానే చీటీల సొమ్మును వసూలు చేస్తున్నారన్నారు . డిపాజిట్ల సేకరణ, ముందుగా చీటీల సొమ్మును వసూళ్లు నిబంధనలకు విరుద్ధమని పునరుద్ఘాటించారు.

Also read: పాదయాత్ర కలిపింది ఆ ఇద్దరినీ!

రామోజీకి రెండు టోపీలు!

మార్గదర్శి వ్యవహారాలపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తితో కూడిన కమిటీతో విచారణ జరిపించాలని ఉండవల్లి అరుణ్ కుమార్ డిమాండ్ చేశారు . ఇటీవలే పదవీ విరమణ చేసిన ఎన్వి రమణ , జాస్తి చలమేశ్వర్ వంటి వారితో విచారణ జరిపించినా పర్వాలేదన్నారు . రామోజీరావుకు రెండు టోపీలు ఉన్నాయని గతంలో సుప్రీంకోర్టులో ఒక న్యాయవాది వ్యాఖ్యానించారని తెలిపారు . వాటిలో ఒకటి మీడియా , మరోటి పారిశ్రామికవేత్త అని , పారిశ్రామికవేత్తకు ప్రభుత్వాలు , ఇతర వ్యవస్థల నుంచి ఇబ్బంది కలిగితే మీడియా టోపీని బయటకు తీస్తారని ఆ న్యాయవాది వ్యాఖ్యానించారన్నారు . ఒక వేళ రామోజీరావు పూర్తిస్థాయి పారిశ్రామికవేత్తగా ఉంటే ప్రపంచంలోనే నెంబర్ వన్ గా నిలిచేవారని కితాబునిచ్చారు.

Also read: త్వరలో విజయసాయిరెడ్డి సొంత మీడియా!

Voleti Diwakar
Voleti Diwakar
వోలేటి దివాకర్ ఆంధ్రభూమి దినపత్రికలో రాజమహేంద్రవరం కేంద్రంలో రెండు దశాబ్దాలకు పైగా పని చేశారు. అంతకు ముందు స్థానిక దినపత్రికలో పని చేశారు. గోదావరి పుష్కరాలు సహా అనేక రాజకీయ, సాంస్కృతిక, సామాజిక ఘట్టాలపై వార్తారచన చేశారు. ప్రస్తుతం ఆన్ లైన్ పత్రికలకు వార్తలూ, వ్యాఖ్యలూ రాస్తున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles