Wednesday, April 24, 2024

         దాతృత్వం తోమానవతను చాటండి: లక్ష్మణ రెడ్డి

గుంటూరు, మార్చి 26: సమాజసేవ తత్పరులు దాతృత్వంతో మానవతను  చాటాలని జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి పేర్కొన్నారు. ఈనెల 26వ తేదీన గుంటూరులోని జన చైతన్య వేదిక కార్యాలయ హాల్లో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ కార్యాలయ ప్రారంభ కార్యక్రమం జరిగింది. ప్రముఖ వైద్యులు డాక్టర్ సత్యప్రియ, ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు ప్రత్యూష సుబ్బారావు మానవత కార్యాలయాన్ని  ప్రారంభించారు. మానవతా బృందం ఐక్యంగా  కృషి చేసి గుంటూరు నగరంలోని పేద ప్రజల కనీస అవసరాలను  తీరుస్తుందన్న ఆశాభావాన్ని ముఖ్యఅతిథి ప్రత్యూష సుబ్బారావు వ్యక్తం చేశారు. ప్రముఖ పారిశ్రామికవేత్తలు శివనాడార్, అజీమ్ప్రేమ్ జీ, సుధా నారాయణమూర్తి లాంటి వారిని ఆదర్శంగా తీసుకొని సమాజంలో అట్టడుగు వర్గాలు వారికీ తోడ్పాటు అందించాలని లక్ష్మణరెడ్డి తెలిపారు. భవిష్యత్ తరాలకు ఉపయోగపడే అంశాలు నేటి తరానికి మనమే అందించాలని మరో ముఖ్యఅతిథి డాక్టర్ సత్యప్రియ అన్నారు. మానవత సంస్థ సెక్రటరీ  వై. రమణ బాబు సంస్థ అర్థ సంవత్సరం నివేదికను సభ్యులకు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి మానవతా సంస్థకు చెందిన రామారావు అధ్యక్షత వహించగా, చైర్మన్ పి. రమేష్ సమన్వయకర్తగా వ్యవహరించారు. మానవతా సంస్థ డైరెక్టర్ ఉప్పలసాంబశివరావు, ఇతర సభ్యులు సభలో పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles