Saturday, April 20, 2024

విధుల్లో నిర్లక్ష్యం, హెచ్ఎండిఎ అధికారులకు పదివేల పెనాల్టీ

హైదరాబాద్ : ఉద్యోగ విధుల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండిఎ) మెట్రోపాలిటన్ కమిషనర్ అర్విoద్ కుమార్ సోమవారం పెనాల్టీ విధించారు.

టిఎస్ బిపాస్ చట్టానికి లోబడి ఫైళ్లను నిర్దేశించిన గడువు లోగాపరిష్కారించడంలో జాప్యం చేసిన నలుగురు అధికారులకు పదివేల రూపాయల(రూ.10,000లు) చొప్పున నలుగురికి మెట్రోపాలిటన్ కమిషనర్ పెనాల్టీ విధించారు.వారిలో హెచ్ఎండిఏలో పనిచేస్తున్న ముగ్గురు అసిస్టెంట్ ప్లానింగ్ ఆఫీసర్స్(ఏపిఓ) సుధీర్ కుమార్, రమేష్ చరణ్, వసుంధర లతో పాటు తహసిల్దార్ గజఫర్ హుస్సేన్ ఉన్నారు.

వీరి వద్ద 16 రోజుల నుంచి 27 రోజుల వరకు ఫైలు పెండింగ్ లో ఉన్నట్టు కమిషనర్ గుర్తించారు. దీనిపై విచారించి ఇలాంటి పరిస్థితులు హెచ్ఎండిఏలో పునరావృతం కాకుండా ఉండాలన్న లక్ష్యంతో మొదటిసారిగా పెనాల్టీ వేయించారు.పురపాలక శాఖ పరిధిలో అభివృద్ధి పనులకు సంబంధించి నిర్దిష్టమైన గడువులోగా అనుమతులు మంజూరు చేయడానికి వీలుగా రాష్ట్ర ప్రభుత్వం టిఎస్ బిపాస్ చట్టాన్ని రూపొందించి అమలు చేస్తున్న సంగతి తెలిసిందే.టీఎస్ బిపాస్ చట్టం ద్వారా ప్రజలకు, నిర్మాణ దారులకు, డెవలపర్లకు అనతి కాలంలో బిల్డింగ్ పర్మిషన్ అనుమతులు లభిస్తున్నాయి. రాష్ట్రంలో ఎంతో సమర్థవంతంగా అమలు అవుతు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది.

సాదిక్
సాదిక్
సాదిక్ పన్నెండేళ్ళకు పైగా ఎలక్ట్రానిక్స్ జర్నలిజంలో ఉన్నారు. కమ్యూనికేషన్స్, జర్నలిజంలలోో ఎంఏ, ఎల్ఎల్ బీ చదివిన విద్యాధికుడు. హెచ్ఎంటీవీలో సీనియర్ కరెస్పాండెంట్ గా పని చేశారు. విశ్వసనీయత, కచ్చితత్వం, సామాజిక శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని వృత్తి విలువలకు నిబద్ధుడై పని చేసే నిష్ఠ కలిగిన జర్నలిస్టు. Phone: 8179221604

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles