Tuesday, April 16, 2024

సింగరేణిలో ఓపెన్ కాస్ట్ ల విస్తరణ

 సింగరేణిలో ఓపెన్ కాస్ట్ గనుల జోరు పెరిగింది. ఉపాధికి అవకాశం ఉన్న భూగర్భ గనులు ఇక వచ్చే అవకాశం తక్కువే. కేంద్ర ప్రభుత్వం విధానాల మారడంతో కొత్త బొగ్గు బ్లాక్లు సింగరేణికి వచ్చే అవకాశం కనిపించడంలేదు. దీనితో మూత పడ్డ భూగర్భ, మూత పడనున్న గనుల ను ఓపెన్ కాస్ట్ గనులుగా మార్చడం లేదా విస్తరణ ల కు వెళ్లే పరిస్థితి ఉంది. అటు కోల్ ఇండియా లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి  ప్రాంతంలో బొగ్గు నిక్షేపాలు అధికంగా ఉండటంతో గోలేటి, మహావీర్‌ ఖని (ఎంవీకే) ఉపరితల గనుల ఏర్పాటుకు యాజమాన్యం సన్నాహాలు చేస్తోంది. ఏరియాలో ప్రస్తుతం కుమురంభీం జిల్లా తిర్యాణి మండలంలో ఖైరిగూర ఓసీపీ, మంచిర్యాల జిల్లా తాండూరు మండల పరిధిలో బీపీఏ ఓసీపీ-2 గనులు కొనసాగుతున్నాయి.

1300 హెక్టార్ల భూమిలో గోలేటి ఓసీపీ:

కొత్తగా ఏర్పాటు చేయనున్న గోలేటి ఉపరితల గని ఏర్పాటుకు 1300 హెక్టార్ల భూమి అవసరం ఉందని అంచనా వేశారు. ఇందులో 615 హెక్టార్లు అటవీభూమి కాగా, మిగతా 685 హెక్టార్లు ప్రభుత్వ, ప్రైవేటు భూమిగా గుర్తించారు. అటవీ భూమి అనుమతుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం చెట్ల గుర్తింపు పరిశీలన కొనసాగుతోంది. వివిధ కారణాలతో మూతకు గురైన గోలేటి-1, 1ఏ ఇంక్లైన్‌, గోలేటి-2 భూగర్భ గనులు, బీపీఏ ఓసీపీలో మిగిలి ఉన్న బొగ్గు నిక్షేపాలను కలుపుకొని కొత్తగా గోలేటి ఓసీపీని ప్రారంభించనున్నారు. ముంపునకు గురయ్యే అబ్బాపూర్‌ గ్రామ నిర్వాసితులకు నర్సాపూర్‌లో 14 ఎకరాల భూమిలో 85 కుటుంబాలకు సింగరేణి యాజమాన్యం పునరావాస కేంద్రం ఏర్పాటు చేసి అభివృద్ధి పనులు చేస్తోంది.మరో మూడేళ్లలోపు తాండూరు మండలంలో ఎంవీకే ఓపెన్‌కాస్టు ప్రారంభించడానికి యాజమాన్యం సన్నాహాలు చేస్తోంది. మూతకు గురైన ఎంవీకే-1,2,3,4,5,6 భూగర్భ గనులను కలుపుకొని ఎంవీకే ఉపరితల గని ఏర్పాటు కానుంది. ఈ గనుల్లో సుమారు 40 మిలియన్‌ టన్నుల బొగ్గు నిక్షేపాలు ఉన్నట్లు గుర్తించారు. ప్రస్తుతం ప్రారంభ దశలోనే ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ రెండు ఓసీపీలు ప్రారంభమైతే ఏరియాకు మరో 20 ఏళ్ల వరకు ఢోకా ఉండదని అధికారులు చెబుతున్నారు. ఖైరిగూర ఓసీపీ మరో 10 ఏళ్ల వరకు కొనసాగనుంది. ఇందులో 35 లక్షల టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

ఇదీ చదవండి: రాజకీయాల్లోనూ అసమానతలు

కొత్తగా ఏర్పాటు అయ్యే ఓసీపీల వివరాలు :

గోలేటి: ఉపరితల గని

ఎక్కడ: ప్రారంభం గోలేటి ప్రాంతం

ప్రారంభం: ఏడాదిన్నర నుంచి రెండేళ్ల లోపు

గుర్తించిన బొగ్గు నిక్షేపాలు: 62 మిలియన్‌ టన్నులు

ఏడాదికి ఉత్పత్తి చేయాల్సిన బొగ్గు: 35 లక్షల టన్నులు

బొగ్గు గ్రేడు: జీ-10, జీ-11

ఉద్యోగుల సంఖ్య: సుమారు 300 నుంచి 500 వరకు

జీవిత కాలం: సుమారు 18 ఏళ్లు

ఏడాదిన్నర లోపు ప్రారంభమయ్యే అవకాశం

బెల్లంపల్లి ఏరియాలో ఏడాదిన్నర నుంచి రెండేళ్ల లోపు గోలేటి ఓసీపీ ప్రారంభించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. గని ఏర్పాటుకు 1300 హెక్టార్ల భూమి అవసరం ఉంది. అటవీ భూముల అనుమతుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామని బెల్లంపల్లి ఏరియా జనరల్ మేనేజర్ బి. సంజీవరెడ్డి తెలిపారు. సింగరేణికి వస్తున్న లాభాలతో 35 శాతం వరకు బెల్లంపల్లి భాగస్వామ్యం ఉండడం విశేషం.

ఇదీ చదవండి: అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత

Muneer MD
Muneer MD
Special Correspondent from Mancherial

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles