Wednesday, April 24, 2024

“మన శౌరి”

  • జపాన్ తో యుద్ధం చేస్తూ అమరుడైన దొడ్ల రంగారెడ్డి
  • శత్రువిమానం కూల్చి, మరో శత్రువిమానం దాడిలో అసువులు బాసిన వీరుడు
  • యుద్ధవిమానాన్ని కూల్చిన తొలి యోధుడు

దొడ్ల రంగా రెడ్డి గురించి చాలా మందికి తెలియదు. నాకూ స్క్రోల్.ఇన్ లోని ఒక వ్యాసం ద్వారా ఆయన గురించి తెలిసింది. రెండవ ప్రపంచ యుద్ధంలో భారతీయ వైమానిక దళ అధికారిగా ఆంగ్లేయుల సైన్యంతో కలిసి యుద్ధం చేస్తూ శత్రు విమానాన్ని పడగొట్టిన మొదటి పైలట్ రంగా రెడ్డి. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెం వాసి. రంగా రెడ్డి 23 ఏళ్లకే తన శౌర్యం, పరాక్రమం ప్రదర్శించి తనువు చాలించిన ధీరుడు.

Also read: ‘‘అభయం’’

స్క్రోల్ లోని వివరాలను బట్టి తెలిసిన విషయాలు: 1944 ఫిబ్రవరి 8న నలుగురు భారతీయ యువ వైమానిక పైలట్లు బర్మాపైన ఆకాశంలో జపాన్ విమానాలతో ముఖాముఖీ తలపడ్డారు. ఆ నలుగురు పైలట్లు ఫ్లైయింగ్ ఆఫీసర్ జగదీష్ చంద్ర వర్మ-25, ఫ్లైయింగ్ ఆఫీసర్ ముర్కోట్ రమున్నీ-28, ఫ్లైయింగ్ ఆఫీసర్ దొడ్ల రంగా రెడ్డి-23, ఫ్లైయింగ్ ఆఫీసర్ జోసఫ్ చార్లెస్ డి లిమా-27. హాకర్ హరికేన్ ఫైటర్ విమానాలను నడిపే ఈ యువకులు భారతీయ వైమానిక దళం లోని 6వ స్క్వాడ్రన్ కు చెందిన వారు. ఆ నాడు ఆంగ్లేయుల వలస రాజ్యమైన భారత దేశానికి, బర్మాకు సరిహద్దు ప్రాంతమైన కాక్స్ బజార్ కు తరలించ బడ్డారు (నేడు ఈ ప్రాంతం బంగ్లాదేశ్ లో భాగం).

Also read: “లాల్ బహదూర్ శాస్త్రి”

జాపనీస్ స్థావరాలపై బాంబుల దాడి

1944 ఫిబ్రవరి 8 ఒక దుర్దినం. సరిహద్దున ఉన్న టాంగ్ బజార్ అనే ఊరి దగ్గరి జపాన్ సైనిక స్థావరాలపై బాంబు దాడికి ఈ నలుగురు నియోగించ బడ్డారు. ఆరోజు ఇద్దరు భారతీయ పైలట్లు చనిపోయారు. కాని రెండవ ప్రపంచ యుద్ధంలో ఒక భారతీయ వైమానికుడు తన ప్రత్యర్ధి విమానాన్ని నేలకూల్చిన మొదటి సందర్భమది. వైమానిక దళ రికార్డ్ ప్రకారం రంగా రెడ్డి, జోసెఫ్ లు తిరిగి రాలేదు. తమ విమానాలకంటే శక్తివంతమైన జపాన్ మిత్సుబిషి విమాన దాడుల్లో వీరు హతమై ఉంటారని భావించ బడింది.

Also read: “విద్యార్ధి”

తిరిగి వచ్చిన రమున్నీ తరువాత అనేక యుద్దాల్లో పాల్గొన్నాడు. 95 ఏళ్ళ వరకు బ్రతికాడు. మలయాళంలో చాలా పుస్తకాలు రాశాడు. ‘స్కై వజ్ ది లిమిట్’ అనే పుస్తకంలో అతను ఇలా రాశాడు:  ‘వర్మ ఆదేశం ప్రకారం నాలుగు విమానాలు అదేశి౦చిన వ్యూహంలో శత్రువు వైపుకు దూసుకు వెళ్ళి బాంబులు కురిపించాలి. ముందు వర్మ, తన వెనుక నేను, తరువాత రంగా రెడ్డి, చివర జోసెఫ్ బయలుదేరాo. మొదటి విమానం బాంబులు కురిపించి పక్కకు తప్పుకుంటున్నప్పుడు శత్రు విమానాలు వచ్చేయడం చూసి అందరిని వెనక్కు వచ్చేయమని ఆదేశించాడు వర్మ. రెడ్డి కేకలు పెట్టాడు నా వెనుక విమానం వస్తుంది, జాగ్రత్త అంటూ. దాని బారి నుండి తప్పించుకోడానికి ఆకాశంలో గిరికీలు కొడుతున్న నా విమానం వెంటపడిన శత్రు విమానాన్ని పేల్చేశాడు రెడ్డి. ఈలోగా అతని వెనుక ఉన్న శత్రు విమానం అతన్ని దెబ్బ తీసింది. అతని విమానం కింద ఉన్న దట్టమైన అడవిలో కూలిపోయింది. ఆ రోజు సాయంత్రం నా గదికి నేను వెళ్ళలేక పోయాను. ఎందుకంటే చాలాకాలంగా నేను, రెడ్డి ఒకే రూములో ఉండేవాళ్ళం. మద్రాస్ ఫ్లైయింగ్ క్లబ్ లో కూడా మేము కలిసి ఉండేవాళ్ళం. మా రూములో తన తల్లికి రాస్తూ సగంలో ఆపిన అతని ఉత్తరం ఉండిపోయింది.

Also read: “వృద్ధాప్యం” 

పార్థివదేహాలు దొరకలేదు

తిరిగిరాని పైలట్లు రెడ్డి, జోసెఫ్ ల శరీరాలు దొరక లేదు. కాని కామన్వెల్త్ యుద్ధ సమాధులలో వారికి గౌరవ స్థానం లభించింది. జోసఫ్ బొంబాయి పట్టణంలోని బాంద్రా నివాసి. నిజానికి అతను విమానాల ముఖాముఖీ పోరాటంలో చనిపోలేదు. అక్క డ తప్పించుకొని తిరిగి వస్తూ సరిహద్దు దాటే సమయంలో నేలపై నుండి శత్రువు పేల్చిన తుపాకిగుండుకు అతని విమానం నేలకూలి చనిపోయాడు. రెడ్డి తన తోటి వాడిని రక్షించే ప్రయత్నంలో తన ప్రాణ రక్షణ చూసుకోకుండా శత్రు విమాన బాంబు దాడికి బలికావడం దురదృష్టం. ఎవరు గుర్తిoచినా, గుర్తించక పోయినా విధిపట్ల అంకిత భావానికి, స్వార్ధ రహిత మానవత్వానికి అతను ప్రతీక.

Also read: “అక్షర ధాం, ఢిల్లీ – అపరూప కళా ఖండం”

రాజేంద్ర సింగ్ బైస్ ఠాకూర్
రాజేంద్ర సింగ్ బైస్ ఠాకూర్
రాజేంద్ర సింగ్ బైస్ ఠాకూర్. చదివింది ఆంగ్ల సాహిత్యం అయినా తెలుగులో కవిత్వం రాస్తారు. ఇతనికి స్వామి చిన్మయానంద, సాయినాధుని శరత్ బాబుజీల కొన్ని రచనల్ని తెలుగులోకి అనువదించే అవకాశం లభించింది. కొన్ని సాహిత్య విమర్శనాత్మక వ్యాసాలు రాశారు త్రివేణి, మిసిమి లాంటివాటిలో. చెప్పదలచుకున్నది కొద్ది మాటల్లోనే వ్యక్త పరచడం ఇతని కవిత్వ లక్షణం. భావుకత, లోతైన ఆలోచన, ఆధునికత, వేదంత విషయాలపై మక్కువ,భాషపై పట్టు ఇతని కవితలలో కనిపిస్తాయి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles