Wednesday, April 24, 2024

రాగ సాయుజ్యం

మనసారా కోరుకున్నా

నెరవేరదని ఊరుకున్నా

కలల సైకతసౌధంపై

బూటుకాళ్ళతో నడిచారెవరో

దార్లు వెేరంటే చేసేది లేక లోకరీతి నడిచా

అనేక వసంతాల తర్వాత కోయిల మళ్ళీ కూసింది

నేను అఫలం కాదు సఫలం అని చెప్పింది

ధన్యత అంటే అప్పుడే తెలిసింది.

దూరాలు, అంతరాలు అంతరాయాలు తెచ్చాయి

మళ్లీ దార్లు వేరంటే

అడువారి మాటల అర్థం అప్పుడే తెలిసింది

నా మనసెప్పుడూ అన్నీ పంచుతూనే ఉంది

ఇన్నాళ్ళ తర్వాత నువ్వూ కాశ్మీర అనుభూతుల్ని

నాకు పంచినపుడు

రాగకమలం విప్పారింది

సాయుజ్యానికి దగ్గరలో.

Also read: కలి

Also read: జనవరి 26

Also read: నా రాత

Also read: మేధావి

Also read: అక్షర ధాం, ఢిల్లీ – అపరూప కళా ఖండం

రాజేంద్ర సింగ్ బైస్ ఠాకూర్
రాజేంద్ర సింగ్ బైస్ ఠాకూర్
రాజేంద్ర సింగ్ బైస్ ఠాకూర్. చదివింది ఆంగ్ల సాహిత్యం అయినా తెలుగులో కవిత్వం రాస్తారు. ఇతనికి స్వామి చిన్మయానంద, సాయినాధుని శరత్ బాబుజీల కొన్ని రచనల్ని తెలుగులోకి అనువదించే అవకాశం లభించింది. కొన్ని సాహిత్య విమర్శనాత్మక వ్యాసాలు రాశారు త్రివేణి, మిసిమి లాంటివాటిలో. చెప్పదలచుకున్నది కొద్ది మాటల్లోనే వ్యక్త పరచడం ఇతని కవిత్వ లక్షణం. భావుకత, లోతైన ఆలోచన, ఆధునికత, వేదంత విషయాలపై మక్కువ,భాషపై పట్టు ఇతని కవితలలో కనిపిస్తాయి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles