Thursday, April 25, 2024

పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన ధర్మపురి నరసింహుడు

* దేశంలో అరుదైన సాంప్రదాయం

* జాతర ఉత్సవాల్లో భాగంగా

ధర్మపురి శ్రీలక్ష్మీనరసింహస్వామి మంగళవారం సాయంత్రం  స్థానిక పోలీస్ స్టేషన్ కు  వెళ్లి రికార్డులను తనిఖీ చేసి, శాంతిభద్రతల అంశాలను పర్యవేక్షించి ఘనంగా పూజలు అందుకున్నారు. భారతదేశంలో ఏ ప్రాంతంలో లేని అరుదైన సనాతన సంప్రదాయం, ఆచారం, అనాదిగా ధర్మపురి క్షేత్రంలో కొనసాగుతున్నది. వివరాల్లోకి వెళితే…

dharmapuri laxminarasimhudu offered prayers at police station

శ్రీలక్ష్మీ నరసింహస్వామి జాతర ఉత్సవాల్లో భాగంగా స్వామివారి ఉత్తర, దక్షిణ దిగ్విజయ యాత్ర కొనసాగడం. ఇందులో భాగంగా శ్రీస్వామివారి  ఉత్సవ విగ్రహాలు ఊరేగింపుగా స్థానిక పోలీస్ స్టేషన్ కు వెళ్లడం సనాతన సంప్రదాయం. ఇందులో భాగంగా పోలీసు అధికారులు ఆలయమునకు వెళ్ళు స్వామివారిని సాంప్రదాయబద్ధంగా ఆహ్వానించడం ఆనవాయితీ.  స్వామివారిని మేళతాళాలు, మంగళ వాయిద్యాలు ,వేద మంత్రాల ఘోషతో పోలీసు అధికారులు, సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు ,మంగళహారతులతో స్వామివారిని ఆలయ ప్రాంగణం నుండి పట్టణ క్షేత్రంలోని ప్రధాన వీధుల గుండా ఊరేగింపుగా పోలీస్స్టేషన్కు తీసుకు వెళ్లడం ఎన్నో ఏళ్ళుగా సాగుతున్న ఆచారం.

Also Read : కన్నుల పండుగగా !!

dharmapuri laxminarasimhudu offered prayers at police station

పోలీస్ స్టేషన్ లో స్వాగతం

పోలీస్ స్టేషన్ ఆవరణ ప్రాంగణంలోకి స్వామి చేరుకోగానే పోలీస్ కుటుంబ సభ్యులు మంగళహారతులతో స్వాగతం పలికి స్టేషన్ ప్రాంగణంలో అందంగా అలంకరించిన వేదికపైకి స్వామి వారిని ఆహ్వానిస్తారు. ఆలయ వేదపండితులు, అర్చకులు, ఘనంగా వేద మంత్రాలతో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా పోలీస్ కుటుంబ సభ్యులను వేదమంత్రాలతో ఘనంగా ఆశీర్వదిస్తారు. స్వామివారి  పల్లకినీ పోలీస్ అధికారులు భుజానికెత్తుకుని పోలీస్ స్టేషన్ ఆవరణలోకి తీసుకువెళ్తారు. ఈ సందర్భంగా పోలీస్ అధికారులు ప్రత్యేక పూజా కార్యక్రమం లో పాల్గొంటారు పూజా ద్రవ్యాలతో పాటు కొన్ని రికార్డులు స్వామి ముందు ఉంచుతారు . డి.ఎస్.పి వెంకటరమణ, ధర్మపురి సిఐ రామచంద్ర రావు, ఎస్ ఐ  కిరణ్, పోలీస్ సిబ్బంది పుర ప్రముఖులు ,ఆలయ అధికారులు, ప్రజా ప్రతినిధులు, భారీ సంఖ్యలో భక్తజనం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Also Read : అంగరంగ వైభవంగా నరసింహుడి కళ్యాణం

dharmapuri laxminarasimhudu offered prayers at police station

ఘనంగా ప్రారంభమైన త్యాగరాజు ఆరాధనోత్సవాలు

శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రాంగణం శేషప్ప కళా వేదికపై మంగళవారం శ్రీ సద్గురు త్యాగరాజ సంగీత ఆరాధనోత్సవాలు ఘనంగా అ ప్రారంభమైనవి. శ్రీ త్యాగరాజ స్వామి శ్రీ చా చం కిష్టయ్య , చిత్రపటాలకు పూలమాలలు వేసి ఉత్సవాలు  ప్రారంభించారు.  డాక్టర్ సంగనభట్ల నరసయ్య, చంద్రశేఖర శాస్త్రి  ఉత్సవాల గురించి వివరించారు. ఈ సందర్భంగా త్యాగరాజ పంచరత్న గానము, శ్రీమతి పద్మ హాసిని, శ్రీమతి మంజుల, శ్రీమతి రేవతి, శ్రీమతి శ్వేత, శ్రీమతి శివ ప్రియ, ఆలపించారు. వివిధ వాగ్గేయకారుల కీర్తనలు, కృతులను, కె నరహరి  అనుపమ సంజీవ్, తదితరులు ఆలపించారు, స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ లక్ష్మీనరసింహ నాట్యమండలి పక్షాన ప్రతి ఏటా శ్రీ స్వామి వారి సన్నిధిలో త్యాగరాజ ఆరాధన ఉత్సవాలు నిర్వహించడం  అనవాయితీ.

Also Read : ధర్మపురి నాట్యమండలికి 85 వసంతాలు

dharmapuri laxminarasimhudu offered prayers at police station
త్యాగరాజ ఉత్సవాలు ప్రారంభమైన సందర్భం
dharmapuri laxminarasimhudu offered prayers at police station

Also Read : ధర్మపురి శ్రీ నరసింహుడి బ్రహ్మోత్సవాలు

Surendra Kumar
Surendra Kumar
Sakalam Correspondent, Dharmapuri

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles