Thursday, March 28, 2024

కైకలూరులో టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య వాగ్వాదం

  • ఉక్కు ఆందోళనలో బాహాబాహీ
  • పరిస్థితిని అదుపులోకి తెచ్చిన పోలీసులు

ఉక్కు ఆందోళన సందర్భంగా కృష్ణాజిల్లా కైకలూరులో వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న బంద్ ఉద్రిక్తంగా మారింది. బంద్ సందర్భంగా టీడీపీ, వైసీపీ, వామపక్షాల కార్యకర్తలు బంద్ లో పాల్గొన్నాయి. అఖిలపక్ష ఆందోళనల్లో భాగంగా పార్టీ ఫెక్సీ ఏర్పాటుపై ఇరు వర్గాల మధ్య ఘర్షణ  నెలకొంది. ఈ నేపథ్యంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే, పార్టీ ఇంఛార్జి జయమంగళ వెంకటరమణ చేతిలో ఉన్న ఫెక్సీని వైసీపీ కార్యకర్తలు లాక్కుని చించివేశారు. వైసీపీ కార్యకర్తలను అడ్డుకునేందుకు టీడీపీ కార్యకర్తలు ప్రయత్నించడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. అప్రమత్తమైన పోలీసులు ఇరువర్గాలను అదుపుచేశారు. వైసీపీ శ్రేణుల తీరును నిరసిస్తూ జయమంగళ వెంకటరమణ, టీడీపీ కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. 

Also Read: ఏపీలో ప్రశాంతంగా కొనసాగుతున్న బంద్

Paladugu Ramu
Paladugu Ramu
సీనియర్ సబ్ ఎడిటర్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles