Thursday, March 28, 2024

గుమ్మడి పువ్వు

చట్టూ అడివంతా వెన్నెల

చెట్లు రాళ్లు కూడా వెలిగిపోతున్నాయ్

బస్సులో నేను, మిగతా ప్రయాణీకులు

హెడ్ లైట్ల కాంతిలో ముందుకు పోతున్న డ్రైవర్.

(గొబ్బిళ్ళలో పేడలో గుచ్చిన గుమ్మడిపువ్వులా

మనిషి ప్రకృతికి దూరంగా అచేతనాల కంటే హీనంగా

కృత్రిమ చీకటి లోకంలో బ్రతికేస్తున్నాడు.)

రాజేంద్ర సింగ్ బైస్ ఠాకూర్
రాజేంద్ర సింగ్ బైస్ ఠాకూర్
రాజేంద్ర సింగ్ బైస్ ఠాకూర్. చదివింది ఆంగ్ల సాహిత్యం అయినా తెలుగులో కవిత్వం రాస్తారు. ఇతనికి స్వామి చిన్మయానంద, సాయినాధుని శరత్ బాబుజీల కొన్ని రచనల్ని తెలుగులోకి అనువదించే అవకాశం లభించింది. కొన్ని సాహిత్య విమర్శనాత్మక వ్యాసాలు రాశారు త్రివేణి, మిసిమి లాంటివాటిలో. చెప్పదలచుకున్నది కొద్ది మాటల్లోనే వ్యక్త పరచడం ఇతని కవిత్వ లక్షణం. భావుకత, లోతైన ఆలోచన, ఆధునికత, వేదంత విషయాలపై మక్కువ,భాషపై పట్టు ఇతని కవితలలో కనిపిస్తాయి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles