Tuesday, April 23, 2024

న్యాయం

మనిషి మనుగడకు మూలసూత్రం

అభయ జీవనానికి నాంది

సుఖమయ బ్రతుకు జీవనాడి

అనాదిగా ఆలోచన రూపంలో నిక్షిప్తం

సంప్రదాయం పేరిట వారసత్వం

మనుధర్మం అంటూ క్రోడీకరణ

మానవత్వాన్ని మతంలో  కలగలపడం

ఆచరణకు దారి కల్పించడం.

మతాన్ని మూలకు నెట్టి

ధర్మ శాస్త్రాలను పక్కన పెట్టి

రాజ్యాగంలో పొందు పరిచాం

శిక్షా స్మృతి పేర పాటిస్తున్నాం.

దేవుడంటే భయం లేని నేడు

సైన్స్ నే  నమ్ముకున్న నేడు

దొరికితేనే దొంగనే రోజులు పోయి

దొంగ అన్నవాడికే దొంగతనం అంటగట్టే

నేటి అతితెలివి సమాజంలో

న్యాయానికి చోటెక్కడ.

రాజ్యాలు పాలించే రాజులే దొంగలైన నాడు

చట్టబద్దంగా అందరిని దోచి కొందరికి పంచే నేడు

న్యాయ వాదులే న్యాయ రక్షకులపై దాడి చేసే నేడు

రక్షకులే నాయకుల బంట్లుగా మారి బక్షకులైన నేడు

రాజకీయ, ధన బలాలతో

న్యాయ దేవత కళ్లకు గంతలు కట్టిన నేడు

పెద్దలు నిర్దేశించిన న్యాయ సూత్రాలను

అంబేద్కర్ బృందం అక్షరీకరించిన రాజ్యాంగాన్ని

అంతరాత్మ ప్రభోదంతో కాపాడుతున్న ధర్మమూర్తుల సంరక్షణలో

గుడ్డిగానైనా మిగిలిన న్యాయ దేవతను

క్షణం క్షణం చిత్రహింసకు గురిచేయకుండా

న్యాయ వ్యవస్థను సంస్కరించి

స్వేచ్ఛ, సమానత్వం, సౌభాతృత్వం కంటే ముందే

రాజ్యాంగంలో చోటిచ్చిన న్యాయాన్ని

ఆచరణ యోగ్యం ఎప్పుడు చేద్దాం

మానవులమని, నాగరీకులమని

చెప్పుకునే అర్హత ఎప్పుడు సంపాదిద్దాం?

Also read: రైలు దిగిన మనిషి

Also read: ఆత్మ నిశ్వాసం

Also read: మా కాలేజ్

Also read: నిర్యాణం

Also read: అతీతులు

రాజేంద్ర సింగ్ బైస్ ఠాకూర్
రాజేంద్ర సింగ్ బైస్ ఠాకూర్
రాజేంద్ర సింగ్ బైస్ ఠాకూర్. చదివింది ఆంగ్ల సాహిత్యం అయినా తెలుగులో కవిత్వం రాస్తారు. ఇతనికి స్వామి చిన్మయానంద, సాయినాధుని శరత్ బాబుజీల కొన్ని రచనల్ని తెలుగులోకి అనువదించే అవకాశం లభించింది. కొన్ని సాహిత్య విమర్శనాత్మక వ్యాసాలు రాశారు త్రివేణి, మిసిమి లాంటివాటిలో. చెప్పదలచుకున్నది కొద్ది మాటల్లోనే వ్యక్త పరచడం ఇతని కవిత్వ లక్షణం. భావుకత, లోతైన ఆలోచన, ఆధునికత, వేదంత విషయాలపై మక్కువ,భాషపై పట్టు ఇతని కవితలలో కనిపిస్తాయి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles