Friday, April 19, 2024

ప్రజా సమస్యలే ధ్యేయంగా బండి సంజయ్ ప్రజా సంగ్రామయాత్ర

ప్రజా సమస్యలే ధ్యేయంగా  బిజెపి రాష్ట్ర అద్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామయాత్ర  కొనసాగుతోంది. రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వ అవినీతి, నియంత, కుటుంబ పాల‌నను ప్రజల్లో ఎండ‌గ‌ట్టటమే లక్ష్యంగా  బండి సంజయ్​ 31  రోజుల పాటు  యాత్ర  చేపట్టారు. ఈ యాత్ర  386 కిలోమీటర్లు పాద యాత్ర  కొనసాగనుంది.  ఐదు జిల్లాలు, మూడు పార్లమెంట్​ సెగ్మెంట్లు, 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ యాత్ర కొనసాగనుంది. రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర జోగులాంబ గద్వాల, నారాయణపేట, రంగారెడ్డి, నాగర్ కర్నూల్,  మక్తల్, జడ్చర్ల, దేవరకద్ర, కల్వకుర్తి, మహేశ్వరం నియోజకవర్గాల వారీగా సాగనుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మొద‌టి ద‌శ ప్రజా సంగ్రామయాత్రను పాత‌బ‌స్తీలోని భాగ్యలక్ష్మి అమ్మవారి ఆల‌యం నుంచి ప్రారంభించారు. ఈసారి అష్టాద‌శ‌ శ‌క్తిపీఠాల్లో ఒక్కటైన జోగులాంబ గద్వాల జిల్లాలోని అలంపురం ఆల‌యం నుంచి గురువారంనాడు  ప్రారంభం అయ్యింది. గడీలు బద్దలు కొడతామని ప్రతిజ్ఞ చేశారు. అవినీతి, నియంత‌, కుటుంబ పాల‌న నిర్మూల‌నే ల‌క్ష్యంగా పాద‌యాత్ర చేస్తున్నట్టు బండి సంజ‌య్ ఇప్పటికే ప్రకటించారు. 31 రోజుల పాటు ఉమ్మడి మహబూబ్ నగర్ నుంచి రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో పాదయాత్ర ముగించనున్నారు బండి సంజయ్. పాదయాత్ర సందర్బంగా  ఊరూరా రచ్చబండలు, నియోజకవర్గ కేంద్రాల్లో సభలు, సమావేశాలు నిర్వహిస్తారు. పాదయాత్రకు  జాతీయ నేతలు, కేంద్రమంత్రులు, బీజేపీ ముఖ్యమంత్రులు పాల్గొంటారని బిజెపి శ్రేణులు అంటున్నాయి.

సాదిక్
సాదిక్
సాదిక్ పన్నెండేళ్ళకు పైగా ఎలక్ట్రానిక్స్ జర్నలిజంలో ఉన్నారు. కమ్యూనికేషన్స్, జర్నలిజంలలోో ఎంఏ, ఎల్ఎల్ బీ చదివిన విద్యాధికుడు. హెచ్ఎంటీవీలో సీనియర్ కరెస్పాండెంట్ గా పని చేశారు. విశ్వసనీయత, కచ్చితత్వం, సామాజిక శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని వృత్తి విలువలకు నిబద్ధుడై పని చేసే నిష్ఠ కలిగిన జర్నలిస్టు. Phone: 8179221604

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles