Friday, April 19, 2024

“కష్టం – సుఖం”

రాజేంద్ర సింగ్ బైస్ ఠాకూర్

కష్టం సుఖం జంట

ఒకదాని వెంట మరోటి

చెమట కార్చే కూలీ

ఒళ్లు మరచి నిద్ర పోతాడు

కష్టపడి చదివినవాడు

ఇష్టపడ్డ జీవితం గడుపుతాడు

ఆడ మగతనాల ఆరాట పోరాటంలో

ఆద్యంతం మిగిలేది సుఖమేగా

జటిల సమస్యలను ఆలోచనతో

అంతర్మధనంతో పరిష్కరించినపుడు ఆనందమేగా

అందుకే అన్నాడు కవి

కలిమి లేములు, కష్ట సుఖాలు

కావడిలో కుండలనే భయమేలోయ్” అని.

కావడి మోత తప్పదు ఎవరికైనా

కావడి మూలం కొయ్యేనని

అది రూపాలు మారుతుందని

తెలుసుకోవడం కష్టం

ఆ సత్యం తెలిస్తే

మిగిలేది మహదానందమే.

Also read: సెంటిమెంట్ లేకపోతే …

Also read: నవరాగం

రాజేంద్ర సింగ్ బైస్ ఠాకూర్
రాజేంద్ర సింగ్ బైస్ ఠాకూర్
రాజేంద్ర సింగ్ బైస్ ఠాకూర్. చదివింది ఆంగ్ల సాహిత్యం అయినా తెలుగులో కవిత్వం రాస్తారు. ఇతనికి స్వామి చిన్మయానంద, సాయినాధుని శరత్ బాబుజీల కొన్ని రచనల్ని తెలుగులోకి అనువదించే అవకాశం లభించింది. కొన్ని సాహిత్య విమర్శనాత్మక వ్యాసాలు రాశారు త్రివేణి, మిసిమి లాంటివాటిలో. చెప్పదలచుకున్నది కొద్ది మాటల్లోనే వ్యక్త పరచడం ఇతని కవిత్వ లక్షణం. భావుకత, లోతైన ఆలోచన, ఆధునికత, వేదంత విషయాలపై మక్కువ,భాషపై పట్టు ఇతని కవితలలో కనిపిస్తాయి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles