Thursday, April 25, 2024

‘పుష్ప’ రెగ్యులర్ షూటింగ్ నవంబరులో

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘పుష్ప’ చిత్రం నవంబరు 6 నుంచి వైజాగ్ లో రెగ్యులర్ షూటింగ్ జరిపేందుకు మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్ణయించింది. కరోనా కల్లోలం, లాక్‌డౌన్ కారణంగా సినిమా షూటింగ్ ఏడు నెలల విరామం తరువాత స్పీడ్ అందుకోనుంది. అల్లు అర్జున్, సుకుమార్ హ్యాట్రిక్ కాంబినేషన్ లో రాబోతున్న ఈ సినిమా పై అటు సినీ పరిశ్రమలో ఇటు అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో విలన్ గా విజయ్ సేతుపతి నటించవలసిఉండగా .. పలు కారణాలరీత్యా ప్రకాష్ రాజ్ , జగపతి బాబులను తీసుకున్నారు. భారీ యాక్షన్ సన్ని వేశాల్ని వైజాగ్ లో షూట్ చేయడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. ఇది ఈ చిత్రానికి హైలెట్ గా చెప్పవచ్చు.

తిరుమల కొండలకు దగ్గర్లో ఉన్న శేషాచలం అడవుల్లో గంధపు చెక్కల స్మగ్లింగ్ కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని నవీన్ యెర్నేని, రవిశంకర్ నిర్మిస్తున్నారు. అల్లు అర్జున్, లారీ డ్రైవర్‌ పుష్పరాజ్ రోల్‌లో అలరించనుండగా.. పల్లెటూరు పిల్లలా రష్మిక అలరించనుంది. చిత్ర యూనిట్ విడుదల చేసిన మోషన్ పోస్టర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచుతున్నాయి.

allu arjun Pushpa movie regular shooting to start from november

ఈ చిత్రం షూటింగ్ నవంబరు 3 నుంచి తూర్పు గోదావరి జిల్లాలోని రంప చోడవరం, మారేడిమిల్లి ప్రాంతాల్లో చిత్రీకరించవలసి ఉండగా … సడన్ గా షెడ్యూల్ ని వైజాగ్ కి మార్చబడింది. అయితే దీనికి గల కారణాలను మాత్రం చిత్ర యూనిట్ వెల్లడించలేదు.

ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. మిగిలిన తారాగణాన్ని చిత్ర యూనిట్ త్వరలో వెల్లడించనుంది.

తెలుగుతో పాటు మరో నాలుగు‌ భాషల్లో విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రం అల్లు అర్జున్ కెరీర్ లో మొట్ట మొదటి పాన్ ఇండియా మూవీ.

Paladugu Ramu
Paladugu Ramu
సీనియర్ సబ్ ఎడిటర్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles